RRR: మా థియేటర్స్‌కు సెక్యూరిటీ కావాలి..వైరల్ అవుతున్న రిక్వెస్ట్ లెటర్..

ABN , First Publish Date - 2021-12-08T16:14:41+05:30 IST

'ఆర్ఆర్ఆర్' మూవీ ట్రైలర్ రిలీజ్ రోజు మా థియేటర్స్‌కు సెక్యూరిటీ కావాలంటూ యాజమాన్యం పోలీసులకు వినతిపత్రం అందచేశారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ న్యూస్‌గా మారింది.

RRR: మా థియేటర్స్‌కు సెక్యూరిటీ కావాలి..వైరల్ అవుతున్న రిక్వెస్ట్ లెటర్..

'ఆర్ఆర్ఆర్' మూవీ ట్రైలర్ రిలీజ్ రోజు మా థియేటర్స్‌కు సెక్యూరిటీ కావాలంటూ యాజమాన్యం పోలీసులకు వినతిపత్రం అందచేశారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ న్యూస్‌గా మారింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హీరోలుగా దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా రూపొందిస్తున్న పాన్ ఇండియన్ సినిమా 'ఆర్ఆర్ఆర్' కొత్త సంవత్సరం ప్రారంభంలో జనవరి 7న భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 10 భాషలలో రిలీజ్ కానున్న ఈ సినిమాపై ఊహించనివిధంగా అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా రేపు ( డిసెంబర్ 9) థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నారు. మొత్తం తెలుగు రాష్ట్రాల్లోనూ ఉన్న వందల సంఖ్యలో ఈ సినిమా ట్రైలర్‌ను ప్రదర్శించడానికి థియేటర్స్ రెడీ అవుతున్నాయి. 


ఈ నేపథ్యంలో రేపు ఉదయం 9 గంటల నుంచి 10 గంటల సమయంలో మా రెండు థియేటర్స్‌కు ప్రొటెక్షన్ కావాలని, వైజాగ్‌కు చెందిన థియేటర్స్ సంగం, శరత్ యాజమాన్యం పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు వారు ఓ రిక్వెస్ట్ లెటర్‌ను పోలీసులకు అందచేశారు. ట్రైలర్ రిలీజ్ సందర్భంగా పెద్ద ఎత్తున అభిమానులు థియేటర్స్‌కు వచ్చే అవకాశం ఉండటం వల్లే ఇలా విశాఖ ఏసీపీకి బందోబస్త్ నిమిత్తం ముందస్తు ప్రణాళికగా లెటర్ అందచేశారు. ఇంతకముందు ఇదే థియేటర్స్‌లో పవన్ కళ్యాణ్ నటించిన 'వకీల్ సాబ్' చిత్ర ట్రైలర్‌ను రిలీజ్ చేసినపుడు పెద్ద ఎత్తున అభిమానులు రావడంతో ఆ ధాటికి అద్దాలు కూడా పగిలిపోయి..కొందరు గాయాలపాలయ్యారు. అందుకే ఈసారి అలా జరగకుండా జాగ్రత్తపడేందుకే థియేటర్స్ యాజమాన్యం భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.  



Updated Date - 2021-12-08T16:14:41+05:30 IST