SS Rajamouli: జపాన్ కెమెరాల్లో బందీగా దర్శక ధీరుడు!

ABN , First Publish Date - 2022-10-20T23:50:38+05:30 IST

‘బాహుబలి’ ప్రాంచైజీతో గుర్తింపు సంపాదించుకున్న దర్శకుడు యస్‌యస్. రాజమౌళి (SS Rajamouli). ‘బాహుబలి’ ఇచ్చిన జోష్‌తో మల్టీస్టారర్ సినిమా ‘ఆర్‌ఆర్‌ఆర్’ (RRR)ను తెరకెక్కించాడు. ఈ చిత్రంలో

SS Rajamouli: జపాన్ కెమెరాల్లో బందీగా దర్శక ధీరుడు!

‘బాహుబలి’ ప్రాంచైజీతో గుర్తింపు సంపాదించుకున్న దర్శకుడు యస్‌యస్. రాజమౌళి (SS Rajamouli). ‘బాహుబలి’ ఇచ్చిన జోష్‌తో మల్టీస్టారర్ సినిమా ‘ఆర్‌ఆర్‌ఆర్’ (RRR)ను తెరకెక్కించాడు. ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ (Junior NTR), రామ్ చరణ్ (Ram Charan) హీరోలుగా నటించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ మార్చి 25న విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయి వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా రూ.1200కోట్లకు పైగా కలెక్షన్స్‌ను కొల్లగొట్టింది. ఈ సినిమా అక్టోబర్ 21న జపాన్‌లో విడుదల కానుంది. అందువల్ల జక్కన్న, తారక్, చెర్రీ ప్రమోషన్స్‌లో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో రాజమౌళి జపాన్ కెమెరాల్లో బందీగా కనిపించాడు. అందుకు సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. 


యస్‌యస్. రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ జపాన్ ప్రమోషన్స్ సందర్భంగా కోజిమా ప్రొడక్షన్స్‌ను సందర్శించాడు. కోజిమా హిదేయో (Kojima Hideo) అనే గేమ్ డెవలపర్‌తో ఫొటోలు తీసుకున్నాడు. ఈ పిక్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ వైరల్ ఫొటోల్లో రాజమౌళి చుట్టూ కెమెరాలు ఉన్నాయి. కెమెరాలన్ని జక్కన్నను స్కాన్ చేస్తున్నాయి. దర్శకధీరుడి అభిమానులందరు ఈ పిక్స్ గురించి చర్చించుకోవడం మొదలుపెట్టారు. మహేశ్‌తో చేయబోయే ప్రాజెక్టు కోసం కోజిమా హిదేయో, రాజమౌళి కలసి పనిచేయబోతున్నారంటూ పుకార్లు షికార్లు కొట్టడం ప్రారంభమయ్యాయి. మహేశ్ సినిమాను కొత్త టెక్నాలజీతో తెరకెక్కించబోతున్నారంటూ నెట్టింట వదంతులు హల్‌చల్ చేయడం మొదలుపెట్టాయి. వీడియో గేమ్‌ను డెవలప్ చేయనున్నారని.. అందు కోసమే జక్కన్న స్కానింగ్ తీసుకుంటున్నారని కొంత మంది సోషల్ మీడియా యూజర్స్ అంటున్నారు. విజువల్ ఎఫెక్ట్స్ కోసమే ఆ విధంగా స్కాన్ చేసుకుంటున్నారని మరికొంత మంది పోస్ట్‌లు పెడుతున్నారు. మరి ఏది నిజమో తెలియాలంటే రాజమౌళి నుంచి ప్రకటన వచ్చే వరకు ఎదురు చూడాల్సిందే.



Updated Date - 2022-10-20T23:50:38+05:30 IST