Anshu Malika: హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న రోజా కుమార్తె.. హీరో ఎవరంటే..

ABN , First Publish Date - 2022-09-28T22:43:09+05:30 IST

సినీ రంగంలోకి వారసులు ఎంట్రీ ఇవ్వడం అనేది చాలా సర్వసాధారణమైన విషయం. అనేక మంది హీరో, హీరోయిన్స్ పిల్లలు సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు.

Anshu Malika: హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న రోజా కుమార్తె.. హీరో ఎవరంటే..

సినీ రంగంలోకి వారసులు ఎంట్రీ ఇవ్వడం అనేది చాలా సర్వసాధారణమైన విషయం. అనేక మంది హీరో, హీరోయిన్స్ పిల్లలు సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు ఏ ఇండస్ట్రీ అందుకు మినహాయింపు కాదు. అలనాటి తార, ఆంధ్రప్రదేశ్ మంత్రి రోజా (Roja) కుమార్తె అన్షు మాలిక (Anshu Malika) సినిమాల్లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వనుందని కోలీవుడ్‌లో పుకార్లు షికార్లు కొడుతున్నాయి. ఖుష్భూ కుమార్తె కూడా హీరోయిన్‌గా వెండితెరపైకి రంగప్రవేశం చేస్తున్న సంగతి తెలిసిందే.   


విక్రమ్ కుమారుడు ధ్రువ్ విక్రమ్ (Dhruv Vikram) కు జోడీగా అన్షు నటించనుందని సమాచారం. కోబ్రా దర్శకుడు అజయ్ జ్ఞానముత్తు (Ajay Gnanamuthu) ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తాడని వదంతులు హల్‌చల్ చేస్తున్నాయి. ఆసక్తికరమైన విషయమేమిటంటే టాలీవుడ్ నిర్మాణ సంస్థ అన్షును లాంచ్ చేయనుంది. ఆమె కోసం అనేక కథలను సిద్ధం చేసిందట. హీరోగా ధ్రువ్ విక్రమ్ అయితే సరిపోతాడని ప్రొడక్షన్ హౌస్ భావించిందట. అతడికి కథను వినిపించి సినిమాలో నటించాలని కోరగా అంగీకరించినట్టు సమాచారం. మేకర్స్‌కు అజయ్ జ్ఞానముత్తు వర్క్ చాలా బాగా నచ్చిందని తెలుస్తోంది. అందువల్ల దర్శకుడిగా అతడిని ఎంపిక చేసుకున్నారని పుకార్లు షికార్లు కొడుతున్నాయి. సెల్వరాజ్‌తో ధ్రువ్ ఓ సినిమాను చేయాల్సి ఉంది. ఆ ప్రాజెక్టు పూర్తి కాగానే అన్షుతో సినిమాను పట్టాలెక్కిస్తారని సమాచారం. రోజా కూతురు అన్షు మాలిక విషయానికి వస్తే.. ఆమె చాలా పుస్తకాలను రాసింది. పలు అవార్డులను కూడా గెలుపొందింది. జీవితానుభావాలకు ఎక్కువగా తన పుస్తకాల్లో చోటిస్తుంది. పలు మ్యాగజైన్ కవర్ పేజెస్‌పై ఫిక్షనల్ రైటర్‌గా దర్శనమిచ్చింది. కాగా,  హీరోయిన్స్ పాత్రలకు రోజా గుడ్ బై చెప్పిన తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారింది. జబర్దస్త్ షోకు జడ్జిగా వ్యవహరించింది. మంత్రి అయ్యాక ఆమె పూర్తిగా సినీ ఇండస్ట్రీకే దూరంగా ఉంటుంది. 



Updated Date - 2022-09-28T22:43:09+05:30 IST