ప్రాణమా... ఏమిటిది?
ABN , First Publish Date - 2021-09-28T05:06:39+05:30 IST
‘‘నాకు ‘వైశాలి’ చిత్రం నుంచి హేమరాజ్ తెలుసు. ఆయన దర్శకత్వం వహించిన ‘రిచిగాడి పెళ్లి’లో కైలాష్ కేర్ పాడిన ‘ఏమిటిది మతి లేదా... ప్రాణమా’ పాట చూశా. ఆనంతశ్రీరామ్ సాహిత్యం, కైలాష్ పాడిన తీరు అద్భుతం....
‘‘నాకు ‘వైశాలి’ చిత్రం నుంచి హేమరాజ్ తెలుసు. ఆయన దర్శకత్వం వహించిన ‘రిచిగాడి పెళ్లి’లో కైలాష్ కేర్ పాడిన ‘ఏమిటిది మతి లేదా... ప్రాణమా’ పాట చూశా. ఆనంతశ్రీరామ్ సాహిత్యం, కైలాష్ పాడిన తీరు అద్భుతం. మళ్లీ మళ్లీ వినాలనుంది. సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నా’’ అని ఎస్.ఎస్. తమన్ అన్నారు. నవీన్ నేని, ప్రణీతా పట్నాయక్, సత్య ఎస్కె, కిశోర్ మర్రిశెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘రిచిగాడి పెళ్లి’. కేఎస్ హేమరాజ్ దర్శకుడు. సత్యన్ స్వరకర్త. ఇటీవల ‘ఏమిటిది మతి లేదా... ప్రాణమా’ పాట విడుదల చేశారు. ‘‘అందరికీ అర్థమయ్యే రీతిలో వేదాంతాన్ని భోదించిన పాట ఇది. ఓ చిన్న ఆట వల్ల కొన్ని జీవితాలు, ప్రేమల్లో ఎన్ని మార్పులు వచ్చాయి? ఎలాంటి మలుపులు తిరిగాయి? అనేది కథ’’ అని అనంత శ్రీరామ్ చెప్పారు. మానవ సంబంధాలకు అద్దం పట్టే కథతో సినిమా తీశామని హేమరాజ్ తెలిపారు.