పండగ తరవాత కూడా వసూళ్లు తగ్గలేదు
ABN , First Publish Date - 2022-01-20T07:16:45+05:30 IST
పండగ తరవాత కూడా వసూళ్లు తగ్గలేదు
ఆశిష్ కథానాయకుడిగా పరిచయమైన చిత్రం ‘రౌడీ బాయ్స్’. దిల్ రాజు నిర్మాత. ఈ సంక్రాంతికి విడుదలైంది. ఈ చిత్రానికి వస్తున్న ఆదరణ పట్ల దిల్రాజు సంతోషం వ్యక్తం చేశారు. బుధవారం ఆయన హైదరాబాద్లో విలేకరులతో మాట్లాడుతూ ‘‘కొత్త హీరో సినిమా అయినా కూడా మంచి వసూళ్లు వచ్చాయి. పండగ తరవాత కూడా వసూళ్ల జోరు తగ్గలేదు. ఈవారం కలక్షన్లు మరింత పెరిగే అవకాశం ఉంది. మౌత్ టాక్తో ఈ సినిమా జనంలోకి వెళ్లిపోయింది. తొలి సినిమాతో కుటుంబ ప్రేక్షకుల్ని టార్గెట్ చేయడం కంటే, యువతని దృష్టిలో ఉంచుకుంటే మంచి ఫలితాలు వస్తాయనిపించింది. అందుకే ఇలాంటి కథ ఎంచుకున్నాం. ఆశిష్ బాధ్యత నాపై ఉంది. అందుకే మంచి కథల కోసం అన్వేషిస్తున్నాం. ఆశిష్ రెండో సినిమా సుకుమార్ రైటింగ్స్లో ప్లాన్ చేశాం. ఈ చిత్రంతో కాశీ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. సుకుమార్ సంభాషణలు అందిస్తార’’న్నారు.