హిందీ వెబ్ సిరీస్లో!
ABN , First Publish Date - 2021-09-25T06:32:25+05:30 IST
హిందీ హీరో షాహిద్ కపూర్, తమిళ నటుడు విజయ్ సేతుపతితో దర్శకద్వయం రాజ్ నిడమోరు, కృష్ణ డీకే ఓ వెబ్ సిరీస్ రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. అందులో కథానాయిక రాశీ ఖన్నా ఓ పాత్రలో నటిస్తున్నారు.....
హిందీ హీరో షాహిద్ కపూర్, తమిళ నటుడు విజయ్ సేతుపతితో దర్శకద్వయం రాజ్ నిడమోరు, కృష్ణ డీకే ఓ వెబ్ సిరీస్ రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. అందులో కథానాయిక రాశీ ఖన్నా ఓ పాత్రలో నటిస్తున్నారు. మరో కథానాయిక రెజీనా కసాండ్రా కూడా ఉన్నారు. ఇటీవల ఆమె చిత్రీకరణ ప్రారంభించారు. తాను షాహిద్, విజయ్ సేతుపతి వెబ్ సిరీస్లో నటిస్తున్నట్టు రెజీనా ధృవీకరించారు. సెట్స్లో ఆమెతో దిగిన ఫొటోను దర్శకుడు కృష్ణ డీకే సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. గతంలో విజయ్ సేతుపతితో రెజీనా ఓ తమిళ వెబ్ ఫిల్మ్ చేశారు. రాశీ ఖన్నా రెండు తమిళ చిత్రాలు చేశారు. షాహిద్ కపూర్తో పాటు ఈ ముగ్గురూ బాలీవుడ్లో డిజిటల్ తెరకు పరిచయమవుతున్న సిరీస్ ఇదే.