అన్నదమ్ముల అనుబంధమే ‘ఆనందం విలైయాడుం వీడు’: దర్శకుడు నందాపెరియస్వామి

ABN , First Publish Date - 2021-09-24T18:20:13+05:30 IST

యువ హీరో గౌతమ్‌ కార్తీక్‌, దర్శకుడు చేరన్‌ ప్రధాన పాత్రల్లో నందా పెరియస్వామి తెరకెక్కించిన చిత్రం ‘ఆనందం విలై యాడుం వీడు’. శ్రీవారి ఫిలిమ్స్‌ పతాకంపై నిర్మితమైన రెండో చిత్రం.

అన్నదమ్ముల అనుబంధమే ‘ఆనందం విలైయాడుం వీడు’: దర్శకుడు నందాపెరియస్వామి

యువ హీరో గౌతమ్‌ కార్తీక్‌, దర్శకుడు చేరన్‌ ప్రధాన పాత్రల్లో నందా పెరియస్వామి తెరకెక్కించిన చిత్రం ‘ఆనందం విలై యాడుం వీడు’. శ్రీవారి ఫిలిమ్స్‌ పతాకంపై నిర్మితమైన రెండో చిత్రం. నిర్మాత పి.రంగనాథన్‌. దాదాపు 35 మందికిపైగా నటీనటులతో భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు. నవంబరు మూడో వారంలో థియే టర్లలో విడుదలకానుంది. నగరంలో జరిగిన విలేకరుల సమావేశంలో దర్శకుడు నందా పెరియస్వామి మాట్లాడుతూ, ‘కరోనా కష్టకాలంలో ప్రారంభించి, అనేక వ్యయప్రయాసలకు ఓర్చి ఈ సినిమా షూటింగ్‌ విజయవంతంగా పూర్తిచేశాం. ఎంతో అన్యోన్యంగా కలిసిమెలిసి ఉండే ఒక కుటంబానికి చెందిన అన్నాదమ్ములు పరిస్థితులు కారణంగా ఎలా చెల్లాచెదురయ్యారు? వారిని హీరో ఏ విధంగా కలిపారన్నదే ఈ చిత్ర కథ. 


ఈ చిత్రం ద్వారా హీరోయిన్‌ జీవితా రాజశేఖర్‌ కుమార్తె శివాత్మిక కోలీవుడ్‌కు తొలిసారి హీరోయిన్‌గా పరిచయమవుతుంది. ఆమె నటన చాలా బాగుందని దర్శకుడు వివరించారు. నిర్మాత పి.రంగనాథన్‌ మాట్లాడుతూ, ‘ఏడుగురు అన్నదమ్ముల కథ ఇది. దీన్ని అందంగా, ప్రతి ఒక్కరినీ మెప్పించేలా దర్శకుడు తెరకెక్కించారు. ఈ కథ నాకు ఎంతో బాగా నచ్చింది. మా బ్యానరులో వస్తున్న రెండో చిత్రం. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికీ మెచ్చే చిత్రంగా నిలుస్తుంది. షూటింగ్‌ పూర్తి చేసుకున్న ‘ఆనందం విలైయాడుం వీడు’ ఆడియో, ట్రైలర్‌ రిలీజ్‌ తేదీలను త్వరలోనే వెల్లడిస్తాం’ అని నిర్మాత వెల్లడించారు. 

Updated Date - 2021-09-24T18:20:13+05:30 IST