మూడేళ్ల గ్యాప్ అందుకే: మహేశ్బాబు
ABN , First Publish Date - 2022-02-04T21:36:29+05:30 IST
‘అతిథి’ సినిమా తర్వాత సూపర్స్టార్ మహేశ్ మూడేళ్ల గ్యాప్ తీసుకున్నారు. ఆ తర్వాత ‘ఖలేజా’ చిత్రం చేసిన ఆయన అప్పటి నుంచీ వరుస సినిమాలు చేస్తున్నారు. అయితే ఆ గ్యాప్కి కారణం ఏంటనేది మహేశ్ వెల్లడించారు. ‘ఆహా’ ఓటీటీలో ఈ వారం స్ర్టీమింగ్ కానున్న ‘అన్ స్టాపబుల్’ షోకి అతిథిగా హాజరు కానున్నారు. దీనికి సంబంధించిన ప్రోమో నెట్టింట వైరల్ అవుతోంది.
‘అతిథి’ సినిమా తర్వాత సూపర్స్టార్ మహేశ్ మూడేళ్ల గ్యాప్ తీసుకున్నారు. ఆ తర్వాత ‘ఖలేజా’ చిత్రం చేసిన ఆయన అప్పటి నుంచీ వరుస సినిమాలు చేస్తున్నారు. అయితే ఆ గ్యాప్కి కారణం ఏంటనేది మహేశ్ వెల్లడించారు. ‘ఆహా’ ఓటీటీలో ఈ వారం స్ర్టీమింగ్ కానున్న ‘అన్ స్టాపబుల్’ షోకి అతిథిగా హాజరు కానున్నారు. దీనికి సంబంధించిన ప్రోమో నెట్టింట వైరల్ అవుతోంది. ఇందులో వ్యాఖ్యాత అడిగిన ప్రశ్నలకు మహేశ్ ఆసక్తికర సమాధానాలు చెప్పారు. ‘ఇంత యంగ్గా ఉన్నావేంటయ్యా బాబూ!’’ అని యాంకర్ అడగ్గా మహేశ్ సిగ్గుపడుతూ నవ్వులు పూయించారు. ఒక సమయంలో మూడేళ్లు గ్యాప్ ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందని యాంకర్ అడిగిన ప్రశ్నకు ‘‘నన్ను నేను కరెక్ట్ చేసుకోవడం కోసం ఆ గ్యాప్ తీసుకున్నా. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసింది లేదు’’ అని మహేశ్ తెలిపారు. ప్రస్తుతం ‘సర్కారు వారి పాట’ సినిమాతో బిజీగా ఉన్న ఆయన త్రివ్రికమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. తాజాగా ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో మొదలైంది. తదుపరి రాజమౌళితో ఓ సినిమా చేయనున్నారు.