నీ చారెడు కళ్లే చదివేస్తూ... నీ మత్తులో మళ్లీ పడిలేస్తూ

ABN , First Publish Date - 2022-06-28T05:34:52+05:30 IST

బెల్లంకొండ గణేష్‌ కథానాయకుడిగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ నిర్మిస్తున్న చిత్రం ‘స్వాతిముత్యం’. వర్ష బొల్లమ్మ కథానాయిక....

నీ చారెడు కళ్లే చదివేస్తూ... నీ మత్తులో మళ్లీ పడిలేస్తూ

బెల్లంకొండ గణేష్‌ కథానాయకుడిగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ నిర్మిస్తున్న చిత్రం ‘స్వాతిముత్యం’. వర్ష బొల్లమ్మ కథానాయిక. లక్ష్మణ్‌ కె.కృష్ణ దర్శకుడు. ఈ చిత్రం నుంచి ‘నీ చారెడు కళ్లే చదివేస్తూ ఉన్నా.. నీ మత్తులో మళ్లీ పడిలేస్తూ ఉన్నా’ అనే గీతాన్ని సోమవారం విడుదల చేశారు. కె.కె సాహిత్యం అందించిన గీతమిది. అర్మాన్‌ మాలిక్‌ ఆలపించారు. మహతి సాగర్‌ స్వరాలు సమకూర్చారు. ‘‘ప్రతి పాటకూ ఓ ప్రసవ వేదన ఉంటుంది. ఈ పాట అందుకు మినహాయింపు కాదు. ఎన్నో వెర్షన్లు రాసిన తరవాత.. ‘ఓకే’ అయ్యింది. ‘తారల్ని మూటగడతా, నీ కాలి ముందు పెడతా, అరె.. చందమామకి నీకూ తేడా లేదుగా, మబ్బుల్ని తెచ్చి కుడతా, రెక్కల్ని చేసి పెడతా’ అనే పదాలు, పాట పల్లవి నాకెంతో నచ్చాయి’’ అన్నారు గీత రచయిత కె.కె. ‘‘కుటుంబ సమేతంగా చూడాల్సిన సినిమా ఇది. నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆగస్టు 13న ఈ చిత్రాన్ని విడుదల చేస్తామ’’ని నిర్మాత సూర్యదేవర నాగవంశీ తెలిపారు. 


Updated Date - 2022-06-28T05:34:52+05:30 IST