‘రామారావు’ డ్యూటీ ఎక్కేది అప్పుడే !

ABN , First Publish Date - 2021-12-06T16:22:58+05:30 IST

మాస్ మహారాజా రవితేజ హీరోగా.. కొత్త దర్శకుడు శరత్ మండవ తెరకెక్కి్స్తోన్న యాక్షన్ ఎంటర్ టైనర్ ‘రామారావు ఆన్ డ్యూటీ’. యసెల్వీ సినిమాస్, ఆర్.టీ.టీమ్ వర్క్స్ సంయుక్త నిర్మాణంలో ఈ సినిమా రూపొందుతోంది. దివ్యాన్షా కౌశిక్, రజిషా విజయన్ కథానాయికలుగా నటిస్తున్నారు. రవితేజ సిన్సియర్ యం.ఆర్వోగా ఇంతకు ముందెన్నడూ చేయని పాత్రలో రవితేజ చెలరేగబోతున్నారు.

‘రామారావు’ డ్యూటీ ఎక్కేది అప్పుడే !

మాస్ మహారాజా రవితేజ హీరోగా.. కొత్త దర్శకుడు శరత్ మండవ తెరకెక్కిస్తోన్న యాక్షన్ ఎంటర్ టైనర్ ‘రామారావు ఆన్ డ్యూటీ’. యసెల్వీ సినిమాస్, ఆర్.టీ.టీమ్ వర్క్స్ సంయుక్త నిర్మాణంలో ఈ సినిమా రూపొందుతోంది. దివ్యాన్షా కౌశిక్, రజిషా విజయన్ కథానాయికలుగా నటిస్తున్నారు.  సిన్సియర్ యం.ఆర్వోగా ఇంతకు ముందెన్నడూ చేయని పాత్రలో రవితేజ చెలరేగబోతున్నారు. ఈ ఏడాది ‘క్రాక్’ మూవీతో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న రవితేజ ఆ తర్వాత ‘ఖిలాడి’ మూవీలో నటించారు. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొంది. దీన్ని వచ్చే ఏడాది ఫిబ్రవరి 11న విడుదల చేయబోతున్నారు. దీనికి సరిగ్గా 44 రోజుల గ్యాప్ తో ‘రామారావు ఆన్ డ్యూటీ’ చిత్రాన్ని విడుదల చేయనుండడం విశేషం. ఈ సినిమాను మార్చ్ 25న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు మేకర్స్. 


ఇలా వెంట వెంటనే రవితేజ తన సినిమాల్ని విడుదల చేస్తుండడం ఆశ్చర్యపరుస్తోంది. ఇక వీటి తర్వాత రవితేజ నక్కిన త్రినాథరావు ‘ధమాకా’, సుధీర్ వర్మ దర్శకత్వంలో ‘రావణాసుర’, వంశీ దర్శకత్వంలో ‘టైగర్ నాగేశ్వరరావు’ చిత్రాల్లోనూ నటిస్తున్నారు. వీటిలో ‘ధమాకా’ చిత్రం కూడా వచ్చే ఏడాదే విడుదల కాబోతోంది. మరి 2022 సంవత్సరంలో రవితేజకు ఏ రేంజ్ లో అదృష్టం కలిసివస్తుందో చూడాలి. 



Updated Date - 2021-12-06T16:22:58+05:30 IST