డర్టీ గేమ్స్ ఆడేవారే ఆ గాసిప్స్ను ప్రచారం చేస్తారంటోన్న రవీనా టండన్
ABN , First Publish Date - 2022-01-28T22:27:54+05:30 IST
సినీ పరిశ్రమలో ఎన్నో మార్పులు వచ్చినా తారలపై వచ్చే గాసిప్స్ మాత్రం ఆగడం లేదు. అలా తనపై వచ్చిన పుకార్లను
సినీ పరిశ్రమలో ఎన్నో మార్పులు వచ్చినా తారలపై వచ్చే గాసిప్స్ మాత్రం ఆగడం లేదు. అలా తనపై వచ్చిన పుకార్లను అలనాటి టాప్ హీరోయిన్ రవీనా టండన్ ఖండిస్తోంది. ఆమె తాజాగా మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకుంది.
1990లలో టాప్ హీరోయిన్లుగా చెలామణి అయిన శిల్పాశెట్టి, కరిష్మా కపూర్, కాజోల్తో తనకు ఎటువంటి విభేదాలు లేవని చెప్పింది రవీనా. అంతే కాదు, అటువంటి డర్టీ పాలిటిక్స్ నడిపేవారికి తాను దూరంగా ఉన్నానని కూడా ఆమె వివరించింది. ‘‘సినిమాల్లో నటించే మొదటి రోజు నుంచే కరిష్మా కపూర్, కాజోల్, శిల్పా శెట్టి నాకు మంచి స్నేహితులు. నేను, శిల్ప కలిసి అనేక సినిమాల్లో నటించాం. ఆ హీరోయిన్స్తో నాకు ఎటువంటి విభేదాలు లేవు. కొంత మంది తారలు మాత్రం డర్టీ గేమ్స్ ఆడతారు. అందులో భాగంగా డర్టీ గాసిప్స్ను ప్రచారం చేస్తారు. అటువంటి వారికి నేను దూరంగా ఉన్నాను’’ అని రవీనా టండన్ చెప్పింది.
‘పత్తర్ కే ఫూల్’ సినిమా ద్వారా రవీనా టండన్ బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో నటనకు గాను ఫిల్మ్ ఫేర్ అవార్డు గెలుచుకొంది. తర్వాత ‘ఖిలాడీ యోం కా ఖిలాడీ’, ‘జిద్దీ’, ‘గులాం ఇ ముస్తఫా’ తదితర సినిమాల్లో నటించింది. ‘సాండ్విచ్’ సినిమాలో గోవిందా సరసన నటించిన అనంతరం సినీ ఇండస్ట్రీ నుంచి విరామం తీసుకుంది. గత ఏడాది ఓటీటీలోకి కూడా ఆమె ఎంట్రీ ఇచ్చింది. ‘అరణ్యక్’ వెబ్ సిరీస్లో పోలీస్ పాత్రను పోషించింది. ఈ వెబ్ సిరీస్ నెట్ఫ్లిక్స్లో అందుబాటులో ఉంది.