గుడ్ బై చెప్పడం తనకిష్టం లేదంటున్న Rashmika Mandanna

ABN , First Publish Date - 2022-06-25T22:16:23+05:30 IST

భాషతో సంబంధం లేకుండా అన్ని ఇండస్ట్రీస్‌లో సినిమాలు చేస్తున్న నటి రష్మిక మందన్న(Rashmika Mandanna). ‘నేషనల్ క్రష్ ఆఫ్ ఇండియా’ గా గుర్తింపు తెచ్చుకున్నారు. అల్లు అర్జున్ హీరోగా నటించిన

గుడ్ బై చెప్పడం తనకిష్టం లేదంటున్న Rashmika Mandanna

భాషతో సంబంధం లేకుండా అన్ని ఇండస్ట్రీస్‌లో సినిమాలు చేస్తున్న నటి రష్మిక మందన్న(Rashmika Mandanna). ‘నేషనల్ క్రష్ ఆఫ్ ఇండియా’ గా గుర్తింపు తెచ్చుకున్నారు. అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘పుష్ప: ది రైజ్’ (Pushpa: The Rise) సినిమాతో ఉత్తరాది నుంచి దక్షిణాది వరకు అభిమానులకు చేరువయ్యారు. బీ టౌన్‌లోకి కూడా ఎంట్రీ ఇస్తున్నారు. మొదటి సినిమాగా ‘మిషన్ మజ్ను’ (Mission Majnu) లో నటించారు. ఈ చిత్రం విడుదల కాలేదు. ఈ లోపునే రెండో ప్రాజెక్టును పూర్తి చేశారు. ‘గుడ్ బై’ (Goodbye) సినిమాను జూన్ 24న ముగించేశారు. దీంతో చిత్ర బృందానికి కృతజ్ఞతలు చెబుతూ సోషల్ మీడియాలో ఆమె ఓ పోస్ట్ పెట్టారు. 


‘గుడ్ బై’ సినిమాకు గుడ్ బై చెప్పడం తనకిష్టం లేదని రష్మిక మందన్న తెలిపారు. ‘‘ ‘గుడ్ బై’ చిత్రీకరణను ముగించేశాను. ఈ సినిమా షూటింగ్ ప్రారంభించి రెండేళ్లయింది. కోవిడ్‌తో సహా ఏది కూడా మమ్మల్ని పార్టీ చేసుకోకుండా ఆపలేకపోయింది. ‘గుడ్ బై’ను చూడటానికి వేచి ఉండలేకపోతున్నాను. ఈ సినిమా ఫన్‌గా ఉంటుంది. నవ్వడానికి కొంచెం సిద్ధంగా ఉండండి. ఈ పిక్‌లో మీరు చూస్తున్న ప్రతి ఒక్కరు.. ఈ బృందంలో నేను పని చేసిన ప్రతి ఒక్కరు ఎల్లప్పుడు నాకు స్పెషల్‌గానే ఉంటారు. అందరం కలసి త్వరలోనే మరోసారి పని చేద్దాం. మీరు ఏలా చేస్తారో నాకు తెలియదు. కానీ, సినిమా జరిగేలా చూడండి. మీరందరు అద్భుతమైన వారు. ఐ లవ్యూ. అమితాబ్ బచ్చన్‌తో సినిమా చేసే అవకాశం రావడం నాకు గర్వంగా ఉంది. మీరు ప్రపంచంలోనే అద్భుతమైన వ్యక్తి. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు వికాస్ బహల్‌కు కృతజ్ఞతలు. నువ్వు ఈ ప్రత్యేకమైన సినిమాలో నన్ను ఎందుకు ఎంపిక చేసుకున్నావో దేవుణ్నికే తెలుసు. నువ్వు గర్వించేలా నటించానని నేను అనుకుంటున్నాను. నీనా గుప్తాను మిస్ అవుతున్నాను. నేను ఇంకా ఎంత సేపు అయినా చెప్పగలను. కానీ, ఇక్కడే ఆపుతున్నాను. సినిమా చూడటానికి అందరు సిద్ధంగా ఉండండి. నేను వేచి ఉండలేకపోతున్నాను’’ అని రష్మిక మందన్న ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టారు. 



Updated Date - 2022-06-25T22:16:23+05:30 IST