Rashmika Mandanna: ఆ సినిమా వల్లే Ranbir Kapoor మూవీలో అవకాశం వచ్చింది
ABN , First Publish Date - 2022-07-01T15:40:42+05:30 IST
‘ఛలో’ సినిమాతో టాలీవుడ్కి పరిచయమైన నటి రష్మికా మందన్నా. అనంతరం వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ టాప్ హీరోయిన్గా..
‘ఛలో’ సినిమాతో టాలీవుడ్కి పరిచయమైన నటి రష్మికా మందన్నా. అనంతరం వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ టాప్ హీరోయిన్గా ఎదిగింది. గతేడాది అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’ సినిమాతో ఈ భామ ఒక్కసారిగా జాతీయ స్థాయిలో స్టార్డమ్ని సొంతం చేసుకుంది. అలాగే.. ‘మిషన్ మజ్ను’, ‘గుడ్బై’ సినిమాలతో డైరెక్ట్ బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది.
ఈ తరుణంలోనే యువ నటుడు రణ్బీర్ కపూర్, ‘అర్జున్ రెడ్డి’ ఫేమ్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం ‘యానిమల్’ సినిమాలో ఈ బ్యూటీకి హీరోయిన్గా నటిస్తోంది. ఈ మూవీ షూటింగ్ ఇటీవలే మొదలైంది. రష్మిక సైతం తాజాగా ఆ టీంలో జాయినైంది. ఈ చిత్రంలో అవకాశం రావడం గురించి తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్వూలో రష్మిక మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను పంచుకుంది.
రష్మిక మాట్లాడుతూ.. ‘పుష్ప మూవీ నా కెరీర్లో పెద్ద టర్నింగ్ పాయింట్. ఆ మూవీలో నా నటనను చూసిన తర్వాత యానిమల్ మేకర్స్ నన్ను సంప్రదించారు. ప్రేక్షకులు నాలోని కొత్త కోణాన్ని ఆస్వాదిస్తారనే నమ్మకం ఉంది. అందుకే మరో ఆలోచన లేకుండా సినిమాకు ఓకే చెప్పేశాను’ అని చెప్పుకొచ్చింది.
కాగా.. ‘పుష్ప: ది రైజ్’లో చేసిన శ్రీవల్లి పాత్రతో రష్మిక ఓవర్నైట్ స్టార్గా మారిపోయింది. అప్పటి నుంచి ఆమె వెనుదిరిగి చూసుకోలేదు. ఆ మూవీలోని ‘సామి సామి’ పాట సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యింది. ఆ సినిమాతో బాలీవుడ్లో భారీ బడ్జెట్ చిత్రాల్లో ఈ భామకి అవకాశాలు వచ్చాయి. గుడ్బై, మిషన్ మజ్ను, యానిమల్తోపాటు పుష్ప: ది రూల్, అలాగే తమిళ్ నటుడు విజయ్తో ఓ సినిమాలో నటిస్తూ బిజీగా ఉంది. ఇందులో పుష్పతోపాటు యానిమల్ పాన్ ఇండియా స్థాయిలో విడుదలకానున్నాయి.