Rashmika Mandanna: మహేశ్, త్రివిక్రమ్ సినిమాలో రష్మిక ఐటం సాంగ్..!
ABN , First Publish Date - 2022-11-30T02:09:45+05:30 IST
సినిమాల్లో వచ్చే ఐటం సాంగ్స్కు ప్రత్యేకంగా ఫ్యాన్స్ ఉంటారు. ఏ చిత్రంలో అయినా స్పెషల్ సాంగ్ ఉంటే ఆ క్రేజే వేరు. అందుకే నిర్మాతలు ప్రత్యేక గీతాల కోసం భారీగా ఖర్చు చేస్తుంటారు.
సినిమాల్లో వచ్చే ఐటం సాంగ్స్కు ప్రత్యేకంగా ఫ్యాన్స్ ఉంటారు. ఏ చిత్రంలో అయినా స్పెషల్ సాంగ్ ఉంటే ఆ క్రేజే వేరు. అందుకే నిర్మాతలు ప్రత్యేక గీతాల కోసం భారీగా ఖర్చు చేస్తుంటారు. గతంలో ఈ పాటలను కొందరు మాత్రమే చేసేవారు. ప్రస్తుతం కాలం మారింది స్టార్ హీరోయిన్స్ కూడా స్పెషల్ సాంగ్స్ చేయడానికి అంగీకరిస్తున్నారు. భారీగా పారితోషికాన్ని తీసుకుంటున్నారు. ఒక్క పాట కోసం నాలుగు నుంచి వారం రోజుల వరకు డేట్స్ కేటాయిస్తే చాలు కోటికి పైగా రెమ్యూనరేషన్ తీసుకోవచ్చాని ఆలోచిస్తున్నారు. శ్రియ, తమన్నా, పూజా హెగ్డే, సమంత స్టార్ హీరోయిన్స్ అందరు ఐటం సాంగ్కు స్టెప్పులేసినవారే. తాజాగా ఈ జాబితాలోకి నేషనల్ క్రష్ ఆఫ్ ఇండియా చేరనుందని ఫిలిం నగర్ వర్గాలు తెలుపుతున్నాయి.
త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) దర్శకత్వంలో మహేశ్ బాబు (Mahesh Babu) ఓ సినిమా చేస్తున్న చేస్తున్న సంగతి తెలిసిందే. వర్కింగ్ టైటిల్గా ‘ఎస్ఎస్ఎమ్బీ28’ (SSMB28) అని వ్యవహరిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ భారీ బడ్జెట్తో చిత్రాన్ని రూపొందిస్తుంది. డిసెంబర్ రెండో వారం నుంచి షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. స్క్రిఫ్ట్ పరంగా సినిమాలో ఐటం సాంగ్కు చోటుందని సమాచారం. ఈ స్పెషల్ సాంగ్ను రష్మిక మందన్నా (Rashmika Mandanna) చేయనుందని ఇండస్ట్రీ వర్గాలు తెలుపుతున్నాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్ చిత్రాల్లో ఇప్పటి వరకు ఐటం సాంగ్స్ లేవు. తొలి సారిగా ఈ మూవీలో పెట్టారని టాక్ వినిపిస్తుంది. మొదటగా ఈ సాంగ్ను బాలీవుడ్ భామతో చేయించాలని మేకర్స్ అనుకున్నారట. ఏమైందో తెలియదు కానీ ఆ ప్లేస్లోకి ప్రస్తుతం రష్మికను తీసుకున్నారని సమాచారం అందుతుంది. ఈ సినిమాలో హీరోయిన్స్గా పూజా హెగ్డే (Pooja Hegde), శ్రీ లీల (Sreeleela) నటిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు. త్రివిక్రమ్, మహేశ్ కలసి చాల కాలం తర్వాత చిత్రం చేస్తుండటంతో ప్రేక్షకులు, ట్రేడ్ వర్గాల్లో ఈ ప్రాజెక్టుపై భారీ అంచనాలున్నాయి.