రష్మిక ‘మిషన్...’ పూర్తి
ABN , First Publish Date - 2021-08-30T06:48:59+05:30 IST
హిందీ చిత్రపరిశ్రమకు రష్మికా మందన్న కథానాయికగా పరిచయమవుతున్న చిత్రం ‘మిషన్ మజ్ను’. వాస్తవ సంఘటనల స్ఫూర్తితో పాకిస్థాన్ గడ్డపై ఓ భారతీయ ‘రా’ ఏజెంట్ ఏం చేశాడన్న కథతో...
హిందీ చిత్రపరిశ్రమకు రష్మికా మందన్న కథానాయికగా పరిచయమవుతున్న చిత్రం ‘మిషన్ మజ్ను’. వాస్తవ సంఘటనల స్ఫూర్తితో పాకిస్థాన్ గడ్డపై ఓ భారతీయ ‘రా’ ఏజెంట్ ఏం చేశాడన్న కథతో సినిమా రూపొందుతోంది. భారత గూఢచారిగా సిద్ధార్థ్ మల్హోత్రా, ఆయనకు జంటగా రష్మిక కనిపిస్తారు. శనివారంతో ఆమె పాత్రకు సంబంధించిన చిత్రీకరణ పూర్తయింది. ‘‘తొలిసారి ‘మిషన్ మజ్ను’ కథ విన్నప్పుడు ‘ఈ అందమైన చిత్రంలో నేను భాగం కావాలి’ అనుకున్నాను. కథ విన్న రోజు నాకింకా గుర్తుంది. అప్పుడే చిత్రీకరణ పూర్తి చేశా. సినిమాకు పనిచేసిన సమయం అంతా ఓ మధురానుభూతిలా గడిచింది’’ అని రష్మిక ట్వీట్ చేశారు. హిందీ పరిశ్రమకు పరిచయం కావడానికి తమ చిత్రాన్ని ఎంపిక చేసుకున్నందుకు ఆమెకు చిత్రనిర్మాత అమర్ థ్యాంక్స్ చెప్పారు.