‘రంగ రంగ’ వచ్చాడు... వైభవంగా!

ABN , First Publish Date - 2022-06-28T05:37:27+05:30 IST

వైష్ణవ్‌తేజ్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘రంగ రంగ వైభవంగా’. కేతికా శర్మ కథానాయిక...

‘రంగ రంగ’ వచ్చాడు... వైభవంగా!

వైష్ణవ్‌తేజ్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘రంగ రంగ వైభవంగా’. కేతికా శర్మ కథానాయిక. బివిఎ్‌సఎన్‌ ప్రసాద్‌ నిర్మాత. గిరీశాయ దర్శకత్వం వహిస్తున్నారు. సోమవారం హైదరాబాద్‌లో టీజర్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ‘‘మెగా ఫ్యామిలీలోని హీరోలందరితోనూ సినిమాలు తీశాను. ఇప్పుడు వైష్ణవ్‌తో సినిమా నిర్మించడం ఆనందంగా ఉంది. అన్ని సినిమాల్లానే ‘రంగ రంగ వైభవంగా’ కూడా మంచి విజయాన్ని సాధిస్తుందన్న నమ్మకం ఉంద’’న్నారు. వైష్ణవ్‌ తేజ్‌ మాట్లాడుతూ ‘‘టీజర్‌ అందరికీ నచ్చేసింది. సినిమా కూడా అంతే బాగుంటుంద’’న్నారు. దర్శకుడు మాట్లాడుతూ ‘‘మా ఇంట్లో అందరూ చిరంజీవిగారి అభిమానులే. ఆయన మేనల్లుడు వైష్ణవ్‌తేజ్‌తో నా సినిమా ‘ఓకే’ అయిందని తెలిసి.. ఆ రోజు మా ఇంట్లో ఎవ్వరూ నిద్రపోలేదు. అందరూ.. చాలా హ్యాపీగా గడిపేశాం. రాధ పాత్రకు కేతిక తప్ప ఇంకెవ్వరూ న్యాయం చేయలేరన్నంత బాగా నటించింద’’న్నారు. మంచి సినిమా చేశామని, ఈ సినిమా అందరికీ పేరు తీసుకొస్తుందని నవీన్‌ చంద్ర అన్నారు. ఇదో ఫీల్‌ గుడ్‌ సినిమా అని కేతిక చెప్పారు. 


Updated Date - 2022-06-28T05:37:27+05:30 IST