కాపీరైట్ వివాదంలో JugJugg Jeeyo.. విడుదలకు ముందే తమకు చూపించాలంటున్న రాంచీ కోర్టు..
ABN , First Publish Date - 2022-06-21T02:28:44+05:30 IST
బాలీవుడ్లో అనేక సినిమాలకు దర్శకుడు, నిర్మాతగా వ్యవహరించి ఫేమ్ సంపాదించుకున్న వ్యక్తి కరణ్ జోహార్ (Karan Johar). ధర్మ ప్రొడక్షన్స్ (Dharma Productions) అనే సొంత నిర్మాణ సంస్థ ఉంది. ఈ
బాలీవుడ్లో అనేక సినిమాలకు దర్శకుడు, నిర్మాతగా వ్యవహరించి ఫేమ్ సంపాదించుకున్న వ్యక్తి కరణ్ జోహార్ (Karan Johar). ధర్మ ప్రొడక్షన్స్ (Dharma Productions) అనే సొంత నిర్మాణ సంస్థ ఉంది. ఈ ప్రొడక్షన్ హౌస్పై ఆయన తాజాగా నిర్మించిన సినిమా ‘జుగ్జుగ్ జీయో’ (Jugjugg Jeeyo). వరుణ్ ధావన్ (Varun Dhawan), కియారా అడ్వాణీ (Kiara Advani) హీరో, హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రం జూన్ 24న విడుదల కానుంది. విడుదల తేదీ దగ్గరపడుతున్న తరుణంలో కరణ్ జోహార్కు షాక్ తగిలింది. తాను పంపించిన పాయింట్స్ని కాపీ కొట్టి ‘జుగ్జుగ్ జీయో’ ని నిర్మించారని ఓ వ్యక్తి ఆరోపించారు. అందుకు సంబంధించిన స్ర్రీన్ షాట్స్ను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. వివరాల్లోకి వెళ్లితే..
రాంచీకి చెందిన రైటర్ విశాల్ సింగ్ (Vishal Singh). ‘బన్నీ రాణీ’ అనే టైటిల్తో కొన్ని పాయింట్స్ను ధర్మ ప్రొడక్షన్స్కు పంపించారు. ఆ సంస్థ నుంచి రిప్లై కూడా వచ్చింది. కానీ, ఆ పాయింట్స్ను సినిమాగా మారుస్తున్నట్టు ధర్మ ప్రొడక్షన్స్ పేర్కొనలేదు. తాజాగా ట్రైలర్ను చూడగా తన స్క్రిఫ్ట్లోని పాయింట్స్ ఆధారంగానే ‘జుగ్జుగ్ జీయో’ ను రూపొందించినట్టు ఆయనకు తెలిసింది. దీంతో రాంచీ కోర్టులో ఆయన దావా వేశారు. ఈ పిటిషన్ను స్వీకరించిన రాంచీ కమర్షియల్ కోర్టు సినిమా విడుదలకు ముందే తమకు చూపించాలని ఉత్తర్వులు జారీ చేసింది. స్క్రీనింగ్ అనంతరం ఇరువైపులా వారి వాదనలు వింటామని పేర్కొంది. కాపీ రైట్ ఉల్లంఘన జరిగిందో, లేదో తేల్చుతామని వెల్లడించింది. ఈ వివాదంపై కరణ్ జోహార్ నిర్మాణ సంస్థ ఇప్పటి వరకు అధికారికంగా స్పందించలేదు. ‘జుగ్జుగ్ జీయో’ లో నీతూ కపూర్, అనిల్ కపూర్ కీలక పాత్రలు పోషించారు. రాజ్ మెహతా దర్శకత్వం వహించారు. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్గా ఈ చిత్రం రూపొందింది.