అభిమానులను కలసి సర్ప్రైజ్ చేసిన Ranbir Kapoor
ABN , First Publish Date - 2022-06-20T22:15:27+05:30 IST
కొత్త రకం కథలు, విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తున్న బాలీవుడ్ నటుడు రణ్బీర్ కపూర్ (Ranbir Kapoor). ఆయన తాజాగా నటిస్తున్న చిత్రం ‘షంషేరా’ (Shamshera). యశ్ రాజ్ ఫిలిమ్స్ నిర్మిస్తుంది.
కొత్త రకం కథలు, విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తున్న బాలీవుడ్ నటుడు రణ్బీర్ కపూర్ (Ranbir Kapoor). ఆయన తాజాగా నటిస్తున్న చిత్రం ‘షంషేరా’ (Shamshera). యశ్ రాజ్ ఫిలిమ్స్ నిర్మించింది. కరణ్ మల్హోత్రా (Karan Malhotra) దర్శకత్వం వహించారు. ఈ సినిమా జులై 22న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్స్ను మొదలుపెట్టింది. అందులో భాగంగా ఈ సినిమా ఫస్ట్లుక్ను జూన్ 20న విడుదల చేసింది. ఈ నేపథ్యంలో రణ్బీర్కు సంబంధించిన మరో వీడియోను నిర్మాణ సంస్థ విడుదల చేసింది. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట హల్చల్ చేస్తుంది.
రణ్బీర్ కపూర్ ‘షంషేరా’ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర బృందం ఓ ఈవెంట్ను నిర్వహించింది. 30మంది లక్కీ విన్నర్స్ను ఎంపిక చేసింది. ‘షంషేరా’ ఫస్ట్లుక్ను లాంచ్ చేయడానికి వారిని పిలిచింది. ఈ కార్యక్రమం నెలరోజుల క్రితం జరిగినట్టు తెలుస్తోంది. అభిమానులు తమకు ఇష్టమైన హీరోను చూడగానే సంతోషంతో ఉబ్బితబ్బిబయ్యారు. ‘‘.. ‘షంషేరా’ ఫస్ట్ లుక్ను లాంచ్ చేయడానికి నా అభిమానులను పిలిచాం. కానీ, ఇక్కడ చిన్న ట్విస్ట్ ఉంది. నేను అభిమానులను కలుసుకుని మాట్లాడుతానని వారికీ తెలియదు’’ అని రణ్బీర్ కపూర్ చెప్పారు. ఈ సినిమాలో వాణీ కపూర్ (Vaani Kapoor)హీరోయిన్గా నటించారు. సంజయ్ దత్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ‘షంషేరా’ ఐమాక్స్ ఫార్మాట్లోను విడుదల కానుందని సినిమా దర్శకుడు కరణ్ మల్హోత్రా తెలిపారు. ‘‘ఈ సినిమా విజువల్ వండర్. గతంలో ప్రేక్షకులు ఎప్పుడు చూడనటువంటి అనుభూతిని ఈ చిత్రం ద్వారా పొందుతారు. ఐ మాక్స్ ఫార్మాట్లో సినిమాను రిలీజ్ చేయడానికి ఉత్సాహంగా ఎదురు చూస్తున్నాం. నేటి ప్రేక్షకులకు ‘షంషేరా’ కొత్త చిత్రం. వారికి కొత్త అనుభూతిని ఇవ్వాలనుకున్నాం. అందుకే ఈ సినిమాను నిర్మిస్తున్నప్పుడే ఐమాక్స్లో విడుదల చేయాలని నిర్ణయించుకున్నాం’’ అని కరణ్ మల్హోత్రా వెల్లడించారు.