Rana Daggubati : సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా పాన్ ఇండియా మూవీ?

ABN , First Publish Date - 2021-10-17T16:28:28+05:30 IST

రానా దగ్గుబాటి ఎర్లియర్ గా ‘అరణ్య’ మూవీతో ప్రేక్షకుల్ని పలకరించారు. ప్రస్తుతం ‘విరాట పర్వం’ చిత్రాన్ని విడుదలకు రెడీ చేశారు. కరోనా సెకండ్ వేవ్ కారణంగా అంతకు ముందు అనుకున్న తేదీలో సినిమా విడుదల కాలేకపోయింది. ఇదిలా ఉంటే రానా, పవర్ స్టార్ తో ‘భీమ్లా నాయక్’ లోనూ, బాబాయ్ వెంకీతో ‘రానా నాయుడు’ వెబ్ సిరీస్ లోనూ నటిస్తున్నారు. ఈ రెండూ కాకుండా.. ఆయన రీసెంట్ గా ఓ పాన్ ఇండియా మూవీకి కమిట్ అయిన సంగతి తెలిసిందే.

Rana Daggubati : సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా పాన్ ఇండియా మూవీ?

రానా దగ్గుబాటి ఎర్లియర్ గా ‘అరణ్య’ మూవీతో ప్రేక్షకుల్ని పలకరించారు. ప్రస్తుతం ‘విరాట పర్వం’ చిత్రాన్ని విడుదలకు రెడీ చేశారు. కరోనా సెకండ్ వేవ్ కారణంగా అంతకు ముందు అనుకున్న తేదీలో సినిమా విడుదల కాలేకపోయింది. ఇదిలా ఉంటే  రానా,  పవర్ స్టార్ తో ‘భీమ్లా నాయక్’ లోనూ, బాబాయ్ వెంకీతో ‘రానా నాయుడు’ వెబ్ సిరీస్‌లోనూ నటిస్తున్నారు. ఈ రెండూ కాకుండా.. ఆయన రీసెంట్‌గా ఓ పాన్ ఇండియా మూవీకి కమిట్ అయిన సంగతి తెలిసిందే. తమిళ దర్శకుడు మిలింద్ రావ్ దర్శకత్వంలో అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమా త్వరలో ప్రారంభం కానుంది. అయితే ఈ సినిమా కథాంశానికి సంబంధించిన ఓ అప్డేట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.   



ఈ సినిమా సూపర్ నేచురల్ థ్రిల్లర్ గా తెరకెక్కనుందట. ఇంతకు ముందు దర్శకుడు మిలింద్ రావ్..  సిద్ధార్ధతో తీసిన ‘గృహం’ మూవీ ఆ తరహా సినిమానే. అలాగే.. ఆ తర్వాత నయనతార తో తీసిన ‘నెట్రికణ్’ కూడా థ్రిల్లర్ మూవీనే. ఇప్పుడు రానాతో తీయబోయే పాన్ ఇండియా మూవీ ఈ రెండింటినీ మించిన ఓ అద్భుతమైన కథతో తెరకెక్కనుందట. రానా ఇదివరకెన్నడూ చేయని ఓ అరుదైన పాత్ర ఇందులో చేయబోతున్నట్టు తెలుస్తోంది. వచ్చే ఏడాది సెట్స్ మీదకు వెళ్ళనున్న ఈ సినిమాను విశ్వశాంతి పిక్చర్స్ బ్యానర్ పై నిర్మాణం జరుపుకోనుంది. మరి రానాకి ఈ సినిమా ఏ స్థాయిలో పేరు తెస్తుందో చూడాలి.  

Updated Date - 2021-10-17T16:28:28+05:30 IST