ఓటీటీలోకి వచ్చేస్తున్న రానా కొత్త మూవీ..
ABN , First Publish Date - 2022-02-04T13:45:30+05:30 IST
రానా హీరోగా నటించిన కొత్త చిత్రం ‘1945’. ఈ మూవీ గత నెల 7న థియేటర్లలో విడుదలై ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. సత్య శివ దర్శకత్వంలో పీరియాడిక్ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కిన చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి
రానా హీరోగా నటించిన కొత్త చిత్రం ‘1945’. ఈ మూవీ గత నెల 7న థియేటర్లలో విడుదలై ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. సత్య శివ దర్శకత్వంలో పీరియాడిక్ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కిన చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి రాబోతుందని మేకర్స్ ప్రకటించారు. ఈ నెల 7 నుంచి సన్నెక్స్ట్లో స్ట్రీమింగ్ కానుంది. ఇక ఈ మూవీలో రానా సరసన హీరోయిన్గా రెజీనా కసాండ్రా నటించింది. సి.కళ్యాణ్ నిర్మించిన ఈ మూవీకి యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. ఇక రానా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో కలిసి నటించిన మల్టీస్టారర్ మూవీ ‘భీమ్లా నాయక్’ రిలీజ్కు రెడీ అవుతోంది. అలాగే, నారా - సాయి పల్లవి - ప్రియమణి ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న ‘విరాట పర్వం’ రిలీజ్ కావాల్సి ఉంది.