RC15 : కథాంశం ఇదేనా?

ABN , First Publish Date - 2021-10-16T16:19:57+05:30 IST

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, మేకింగ్ కింగ్ శంకర్ కాంబో మూవీ త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ కు వెళ్ళబోతోంది. రీసెంట్ గా ‘ఆచార్య, ఆర్.ఆర్.ఆర్’ షూటింగ్స్ ను కంప్లీట్ చేసుకొన్న చెర్రీ వెనువెంటనే చేయబోయే సినిమా ఇదే అవడంతో ఈ సినిమాపై ఆసక్తి మరింతగా నెలకొంది. ‘ఆర్.ఆర్.ఆర్’ తో చెర్రీ ఎలాగూ.. పాన్ ఇండియా స్టార్ కాబోతున్నాడు.

RC15 : కథాంశం ఇదేనా?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, మేకింగ్ కింగ్ శంకర్ కాంబో మూవీ త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ కు వెళ్ళబోతోంది. రీసెంట్ గా ‘ఆచార్య, ఆర్.ఆర్.ఆర్’ షూటింగ్స్ ను కంప్లీట్ చేసుకొన్న  చెర్రీ వెనువెంటనే చేయబోయే సినిమా ఇదే అవడంతో ఈ సినిమాపై ఆసక్తి మరింతగా నెలకొంది. ‘ఆర్.ఆర్.ఆర్’ తో చెర్రీ ఎలాగూ.. పాన్ ఇండియా స్టార్ కాబోతున్నాడు. శంకర్ ఆల్రెడీ పాన్ ఇండియా దర్శకుడు. అందుకే ఈ సినిమాని కూడా పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయబోతున్నారు. దిల్ రాజ్ ప్రొడక్షన్స్ లో దాదాపు రూ. 170 కోట్లతో ఈ సినిమా నిర్మాణం జరుపుకోబోతోంది. 



ఇక RC15 కథాంశంపై రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఇందులో కథానాయికగా నటిస్తోన్న కియారా అద్వానీ ఈ సినిమా  పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో రూపొందుతోందనే క్లూ ఇచ్చింది. దాంతో ఈ సినిమా కథాంశం ఇదే అంటూ.. సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఒక ఐఏయస్ ఆఫీసర్ రాజీకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. అస్తవ్యస్తమైన ఆ వ్యవస్థని ఎలా సరిచేస్తాడు అన్నదే ఈ సినిమా ప్రధాన కథాంశం అని తెలుస్తోంది. ఈ సందర్భంగా శంకర్, గతంలో అర్జున్ తో తీసిన ‘ఒకే ఒక్కడు’ సినిమాని గుర్తు చేసుకుంటున్నారు. అయితే ఈ సినిమా కూడా ఇంచుమించు అలాంటిదే అయినా.. ఇందులో శంకర్ ఎంచుకొనే పాయింట్ డిఫరెంట్ గా ఉంటుందని టాక్. మరి ఈ సినిమాతో శంకర్ మళ్ళీ డైరెక్టర్ గా బౌన్స్ బ్యాక్ అవుతారేమో చూడాలి. 

Updated Date - 2021-10-16T16:19:57+05:30 IST