KGF దర్శకుడితో సినిమా చేయనున్న Ram Charan
ABN , First Publish Date - 2021-10-16T00:18:44+05:30 IST
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వరుసగా సినిమాలను ప్రకటిస్తూ అభిమానులను సర్ ప్రైజ్కు గురి చేస్తున్నారు. భారతీయడు, రోబో, 2.0 చిత్రాలకు దర్శకత్వం వహించిన శంకర్తో సినిమా చేయబోతున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వరుసగా సినిమాలను ప్రకటిస్తూ అభిమానులను సర్ ప్రైజ్కు గురి చేస్తున్నారు. భారతీయడు, రోబో, 2.0 చిత్రాలకు దర్శకత్వం వహించిన శంకర్తో సినిమా చేయబోతున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. పాన్ ఇండియా మూవీగా ఈ చిత్రం తెరకక్కనుంది. ఆ సినిమా షూటింగ్ ఇంకా ప్రారంభం కాకముందే మరో సినిమాను కూడా చేయనున్నట్టు తెలిపారు.
ప్రశాంత్ నీల్, రామ్ చరణ్ కలిసి ఒక చిత్రం చేయనున్నారు. ఈ సినిమా పాన్ ఇండియా మూవీగా రూపొందనుందని తెలుస్తోంది. డీవీవీ మూవీస్ సంస్థ ఈ సినిమాను నిర్మించబోతోంది. ప్రశాంత్ నీల్ గతంలో కేజీఎఫ్ సినిమాకు దర్శకత్వం వహించాడు. ప్రస్తుతం సలార్ మూవీకి డైరెక్షన్ చేస్తున్నారు. చిరంజీవి నివాసంలో ప్రశాంత్ నీల్, రామ్ చరణ్ను కలిశారు. ముగ్గురు కలిసి ఉన్న ఫొటోను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఆయన ట్వీట్ చేస్తూ..‘‘ నేను రామ్ చరణ్ను కలిశాను. ఒక చిత్రం కూడా చేయనున్నాం. మాకు అతిథ్యం ఇచ్చినందుకు చరణ్కు థ్యాంక్స్. ఈ సాయంత్రం ఎంతో అద్భుతంగా గడిచింది. చిరంజీని గారిని కలవాలనే నా చిన్ననాటి కల నెరవేరింది’’ అని చెప్పారు.
రామ్ చరణ్ కూడా ఆ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. ‘‘ ప్రశాంత్ నీల్ ను కలుసుకోవడం ఎంతో అద్భుతంగా ఉంది. ఈ సాయంత్రం ఎప్పటికీ గుర్తుండి పోతుంది ’’ అన్నారు. ప్రస్తుతం రామ్ చరణ్ నటించిన ఆర్ఆర్ఆర్, ఆచార్య సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ పాన్ ఇండియా సినిమాను చేయనున్నారు. ఆ సినిమాను దిల్ రాజు నిర్మించనున్నారు. జెర్సీ సినిమాకు దర్శకత్వం వహించిన గౌతమ్ తిన్ననూరితో కూడా మరో చిత్రం చేయనున్నారు.