సాంగ్స్ రికార్డింగ్లో శంకర్, చరణ్ కాంబో మూవీ
ABN , First Publish Date - 2021-07-18T21:41:58+05:30 IST
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సంచలన దర్శకుడు శంకర్ కాంబినేషన్లో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ ఓ చిత్రాన్ని
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సంచలన దర్శకుడు శంకర్ కాంబినేషన్లో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ ఓ చిత్రాన్ని రూపొందించబోతోన్న విషయం తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లో 50వ చిత్రంగా ఈ చిత్రం తెరకెక్కబోతోంది. తాజాగా ఈ చిత్ర సాంగ్స్ రికార్డింగ్ మొదలైనట్లుగా తెలుస్తోంది. అంతేకాదు ఇప్పటికే ఓ పాటకు సంబంధించిన రీ రికార్డింగ్ కూడా పూర్తయినట్లుగా టాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తోంది. శంకర్, రామ్ చరణ్ల ఆధ్వర్యంలో హైదరాబాద్లో ఈ పాట రికార్డింగ్ జరిగినట్లుగా సమాచారం. ఈ మధ్య కాలంలో టాలీవుడ్లో బ్లాక్బస్టర్ మ్యూజిక్ దర్శకుడిగా పేరొందిన ఓ యువ సంగీత దర్శకుడు ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నట్లుగా తెలుస్తోంది. మ్యూజిక్ డైరెక్టర్, సినిమాకు సంబంధించిన ఇతర వివరాలను త్వరలోనే చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించనుంది.