#RAPO19 : సెకండ్ షెడ్యూల్ పూర్తి!

ABN , First Publish Date - 2021-10-17T21:09:13+05:30 IST

ఎనర్జిటిక్ స్టార్ రామ్, లింగుసామి కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న యాక్షన్ ప్యాక్డ్ మూవీ ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. ‘ఇస్మార్ట్ శంకర్’ తర్వాత ‘రెడ్’ తో ప్రేక్షకుల్ని పలకరించిన రామ్.. ఆ మూవీ రిజల్ట్ తో నిరాశ చెందాడు. అందుకే లింగుసామి మూవీపై స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు. ‘ఉప్పెన’ బ్యూటీ కృతిశెట్టి కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడో ప్రారంభమైంది.

#RAPO19 : సెకండ్ షెడ్యూల్ పూర్తి!

ఎనర్జిటిక్ స్టార్ రామ్, లింగుసామి కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న యాక్షన్ ప్యాక్డ్ మూవీ ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. ‘ఇస్మార్ట్ శంకర్’ తర్వాత ‘రెడ్’ తో ప్రేక్షకుల్ని పలకరించిన రామ్.. ఆ మూవీ రిజల్ట్ తో నిరాశ చెందాడు. అందుకే లింగుసామి మూవీపై స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు. ‘ఉప్పెన’ బ్యూటీ కృతిశెట్టి కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడో ప్రారంభమైంది. కాగా ఇప్పుడు సెకండ్ షెడ్యూల్ కంప్లీట్ అయినట్టు అఫీషియల్ గా ప్రకటించారు. లింగుసామి అండ్ టీమ్ ఆ విషయాన్ని తెలియచేస్తూ ట్విట్టర్ లో ఫోటో షేర్ చేశారు. 



ఇక ఈ సినిమాకి ‘ఉస్తాద్’ అనే టైటిల్ ను రిజిస్టర్ చేయించారు. ‘ఇస్మార్ట్ శంకర్’ బ్లాక్‌బస్టర్ తో ఉస్తాద్ గా మారిన రామ్‌కి ఈ టైటిల్ యాప్ట్ అని చిత్ర బృందం భావిస్తోంది. నిజానికి ఈ సినిమాను అల్లు అర్జున్ తో తీయాలనుకున్నారు దర్శకుడు లింగుసామి. ఏవో కారణాలతో ఆ కాంబో వర్కవుట్ కాలేదు. అదే కథతో లింగుసామి రామ్ ను ఒప్పించారు. తమిళ, తెలుగు బైలింగ్విల్ మూవీగా విడుదల కానున్న ఈ సినిమా రామ్ కు ఏ స్థాయిలో పేరు తెస్తుందో చూడాలి. 



Updated Date - 2021-10-17T21:09:13+05:30 IST