Raksha Bandhan: ఓటీటీలోకి వచ్చేస్తున్న అక్షయ్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
ABN , First Publish Date - 2022-10-02T23:29:40+05:30 IST
బాలీవుడ్లో శర వేగంగా సినిమాలు చేసే నటుడు అక్షయ్ కుమార్ (Akshay Kumar). 30రోజుల నుంచి 40రోజుల్లోనే చిత్రాలను పూర్తి చేస్తుంటాడు.
బాలీవుడ్లో శర వేగంగా సినిమాలు చేసే నటుడు అక్షయ్ కుమార్ (Akshay Kumar). 30రోజుల నుంచి 40రోజుల్లోనే చిత్రాలను పూర్తి చేస్తుంటాడు. అంతే వేగంతో వాటిని విడుదల చేస్తుంటాడు. అతడు తాజాగా నటించిన మూవీ ‘రక్షా బంధన్’ (Raksha Bandhan). భూమి ఫడ్నేకర్ (Bhumi Pednekar) హీరోయిన్గా నటించింది. ఆనంద్ ఎల్.రాయ్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 11న విడుదలైంది. ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచే మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన వారంతా ఓటీటీలోకి ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. ప్రేక్షకుల ఎదురు చూపులకు తెర దించుతూ ఈ సినిమా త్వరలోనే ఓటీటీలోకి రాబోతుంది. డిజిటల్ ప్లాట్ఫామ్ తాజాగా స్ట్రీమింగ్ డేట్ను ప్రకటించింది.
‘రక్షా బంధన్’ జీ-5లో స్ట్రీమింగ్ కానుంది. ఓటీటీలో అక్టోబర్ 5నుంచి అందుబాటులో ఉండనుంది. 190దేశాల్లోని ప్రేక్షకులు ఈ చిత్రాన్ని చూడవచ్చని ఆ సంస్థ ఓ ప్రకటనను విడుదల చేసింది. ‘రక్షా బంధన్’ ను జీ స్టూడియోస్, కేప్ ఆఫ్ గుడ్ ఫిలిమ్స్, కలర్ యెల్లో ప్రొడక్షన్స్ కలసి నిర్మించాయి. లాల్ కేదార్ నాథ్ అనే వ్యక్తి ప్రయాణాన్ని ఈ చిత్రంలో చూపించారు. అతడికి నలుగురు చెల్లెళ్లతో ఉన్న అనుబంధాన్ని హృద్యంగా ఆవిష్కరించారు. ‘రక్షా బంధన్’ ఓటీటీలోకి రాబోతున్న సందర్భంగా జీ-5 బిజినెస్ హెడ్ మనీశ్ కల్రా మీడియాతో మాట్లాడాడు. ‘‘దేశంలోని మంచి కథలను ఎలప్పుడు మేం చెప్పాలనుకున్నాం. ‘రక్షా బంధన్’ ఆ కోవకు చెందినదే. నేటి ఆధునిక ప్రపంచంలో ప్రియమైన వారిని కలుసుకోవాడానికి కొంచెం సమయం మాత్రమే ఉంటుంది. ఫ్యామిలీలందరు ఒకే దగ్గరకు చేరి వీక్షించే అవకాశాన్ని ‘రక్షా బంధన్’ కల్పిస్తుంది’’ అని మనీశ్ తెలిపాడు. ‘రక్షా బంధన్’ అద్భుతమైన కుటుంబ కథా చిత్రమని అక్షయ్ పేర్కొన్నాడు. ఈ సినిమాను చూసి అందరు నవ్వుతారు, ఏడుస్తారని చెప్పాడు.