అక్టోబర్ 1న ‘రాజవంశం’ రిలీజ్‌

ABN , First Publish Date - 2021-09-22T19:20:31+05:30 IST

ప్రముఖ దర్శకుడు సుందర్‌.సి వద్ద సహాయ దర్శకుడుగా పనిచేసిన కదిర్‌వేలు దర్శకుడుగా తెరకెక్కించిన మూవీ ‘రాజవంశం’. సీనియర్‌ నటుడు శశికుమార్‌, నిక్కీ గల్రానీ జంటగా నటించారు.

అక్టోబర్ 1న ‘రాజవంశం’  రిలీజ్‌

ప్రముఖ దర్శకుడు సుందర్‌.సి వద్ద సహాయ దర్శకుడుగా పనిచేసిన కదిర్‌వేలు దర్శకుడుగా తెరకెక్కించిన మూవీ ‘రాజవంశం’. సీనియర్‌ నటుడు శశికుమార్‌, నిక్కీ గల్రానీ జంటగా నటించారు. యోగిబాబు, సతీ్‌షతో పాటు ఏకంగా 49 మంది నటీనటులు ఇందులో వివిధ పాత్రలు పోషించారు. శ్యామ్‌ సీఎస్‌ సంగీతం సమకూర్చిన ఈ చిత్రం గత మార్చిలోనే విడుదల కావాల్సి ఉండగా కరోనా రెండో దశ కారణంగా వాయిదాపడింది. ప్రస్తుతం పరిస్థితులు చక్కబడటంతో అక్టోబర్ ఒకటో తేదీన రిలీజ్‌ చేయనున్నట్టు చిత్ర బృందం అధి కారికంగా ప్రకటించింది.

Updated Date - 2021-09-22T19:20:31+05:30 IST