తన సినిమాకి తానే గెస్ట్‌గా రాజమౌళి

ABN , First Publish Date - 2021-07-15T01:15:26+05:30 IST

తన సినిమాకి తానే గెస్ట్‌గా రాబోతున్నారట దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి. ఆయన దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా 'ఛత్రపతి' సినిమా రూపొంది భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా అటు రాజమౌళి, ఇటు ప్రభాస్ కి మైల్ స్టోన్ మూవీగా నిలిచింది.

తన సినిమాకి తానే గెస్ట్‌గా రాజమౌళి

తన సినిమాకి తానే గెస్ట్‌గా రాబోతున్నారట దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి. ఆయన దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా 'ఛత్రపతి' సినిమా రూపొంది భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా అటు రాజమౌళి, ఇటు ప్రభాస్ కి మైల్ స్టోన్ మూవీగా నిలిచింది. ఈ సినిమాను హిందీలో రీమేక్ చేస్తున్నట్టు చాలా రోజుల క్రితమే ప్రకటన వచ్చింది. ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్ దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా ఈ రీమేక్ రూపొందనుంది. వీరిద్దరికి హిందీలో ఇది డెబ్యూ సినిమా. ఈపాటికే సెట్స్ మీదకి రావాల్సి ఉండగా కరోనా సెకండ్ వేవ్ కారణంగా ప్రారంభమవలేదు. కాగా జూలై 16న 'ఛత్రపతి' హిందీ రీమేక్‌ను ఘనంగా ప్రారంభించబోతున్నారని విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. ఈ ప్రారంభోత్సవానికి దర్శకుడు రాజమౌళి, స్టార్ ప్రొడ్యూసర్ ఏ.ఎం.రత్నం సహా పలువురు సినీ ప్రముఖులు ముఖ్య అథిదులుగా విచ్చేయనున్నారని టాక్ వినిపిస్తోంది. 

Updated Date - 2021-07-15T01:15:26+05:30 IST