‘స్టాండప్ రాహుల్’ ఓటీటీలోకి వచ్చేస్తున్నాడు
ABN , First Publish Date - 2022-03-30T02:26:42+05:30 IST
యంగ్ హీరో రాజ్ తరుణ్, వర్ష బొల్లమ్మ హీరోహీరోయిన్లుగా డ్రీమ్ టౌన్ ప్రొడక్షన్, హైఫైవ్ పిక్చర్స్ బ్యానర్లపై.. శాంటో మోహన్ వీరంకి దర్శకత్వంలో నంద కుమార్ అబ్బినేని, భరత్ మాగులూరి నిర్మించిన చిత్రం ‘స్టాండప్ రాహుల్’. మార్చి 18 థియేటర్లలో..
యంగ్ హీరో రాజ్ తరుణ్, వర్ష బొల్లమ్మ హీరోహీరోయిన్లుగా డ్రీమ్ టౌన్ ప్రొడక్షన్, హైఫైవ్ పిక్చర్స్ బ్యానర్లపై.. శాంటో మోహన్ వీరంకి దర్శకత్వంలో నంద కుమార్ అబ్బినేని, భరత్ మాగులూరి నిర్మించిన చిత్రం ‘స్టాండప్ రాహుల్’. మార్చి 18 థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం మంచి టాక్నే సొంతం చేసుకుంది. కానీ ‘ఆర్ఆర్ఆర్’ ధాటికి అతి తక్కువ సమయంలోనే థియేటర్ల నుండి ఈ చిత్రం వైదొలగాల్సి వచ్చింది. థియేటర్లలో ఈ చిత్రాన్ని మిస్ అయిన వారి కోసం చిత్రయూనిట్ ఈ చిత్రాన్ని ఇప్పుడు ఓటీటీలోకి తీసుకొస్తుంది. ఏప్రిల్ 8 నుండి ‘ఆహా’ ఓటీటీలో ‘స్టాండప్ రాహుల్’ సందడి చేయనున్నాడు. ఈ విషయాన్ని ‘ఆహా’ ఓటీటీ సంస్థ అధికారికంగా తెలియజేస్తూ.. ఓ పోస్టర్ని విడుదల చేసింది.
రాజ్ తరుణ్ స్టాండప్ కమెడియన్గా నటించిన ఈ చిత్రంలో ఇంద్రజ, మురళీ శర్మ, వెన్నెల కిశోర్ వంటి వారు ప్రధాన పాత్రలలో నటించారు. ‘స్టాండప్ అనే వర్డ్ స్ట్రిక్ట్ పీటీ టీచర్ లాగా అనిపించినా.. మూవీ మాత్రం ఫన్ ఉంటది’.. అంటూ ‘ఆహా’ ప్రచారం మొదలెట్టింది. ఏప్రిల్ 8న ‘ఆహా’లోకి వచ్చేస్తున్న ‘స్టాండప్ రాహుల్’.. మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడం ఖాయం అనేలా.. సోషల్ మీడియాలో రీల్స్ కూడా మొదలయ్యాయి.