డ్రగ్స్ కేసు తర్వాత కోలీవుడ్‌లోకి రాగిణి ద్వివేది ఎంట్రీ

ABN , First Publish Date - 2022-01-19T03:35:07+05:30 IST

గతంలో శాండల్‌వుడ్‌లో వెలుగు చూసిన డ్రగ్స్‌ కేసులో అరెస్ట్ అయి.. దాదాపు నాలుగు నెలల పాటు జైలు జీవితాన్ని గడిపిన రాగిణి.. కోర్టు బెయిల్‌ మంజూరు చేయడంతో జైలు నుంచి విడుదలైంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఒక కన్నడ చిత్రంలో నటించేందుకు

డ్రగ్స్ కేసు తర్వాత కోలీవుడ్‌లోకి రాగిణి ద్వివేది ఎంట్రీ

ప్రముఖ దర్శకనటుడు సుందర్‌.సి హీరోగా కన్నడ నటి రాగిణి ద్వివేది హీరోయిన్‌గా కె.తిరుఙ్ఞానం దర్శకత్వంలో ఒక చిత్రం రూపుదిద్దుకోనుంది. దీనికి ‘ఒన్‌ 2 ఒన్‌’ అనే పేరును ఖరారు చేశారు. సిద్ధార్థ్‌ విపిన్‌ సంగీతం సమకూర్చుతున్న ఈ చిత్రంలో విజయ్‌ వర్మ, జార్జ్‌ ఆంటోనీ, విచ్చు, మనశ్విని తదితరులు నటిస్తున్నారు. త్వరలో షూటింగ్‌ ప్రారంభంకానున్న ఈ చిత్రంతో రాగిణి ద్వివేది చాలాకాలం తర్వాత కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది. 


గతంలో శాండల్‌వుడ్‌లో వెలుగు చూసిన డ్రగ్స్‌ కేసులో అరెస్ట్ అయి.. దాదాపు నాలుగు నెలల పాటు జైలు జీవితాన్ని గడిపిన రాగిణి.. కోర్టు బెయిల్‌ మంజూరు చేయడంతో జైలు నుంచి విడుదలైంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఒక కన్నడ చిత్రంలో నటించేందుకు అంగీకరించిన ఆమె.. తాజాగా సుందర్‌ సరసన హీరోయిన్‌గా ఎంపికైంది. 24 హవర్స్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై నిర్మించిన ఈ చిత్రం పూజా కార్యక్రమాలు తాజాగా చెన్నై నగరంలో జరిగాయి. 

Updated Date - 2022-01-19T03:35:07+05:30 IST