థియేటర్స్‌లోనే ‘రాధేశ్యామ్’

ABN , First Publish Date - 2022-01-27T14:29:59+05:30 IST

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తాజా చిత్రం ‘రాధేశ్యామ్’ విడుదల కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఈ సంక్రాంతికి విడుదల కావాల్సిన ఈ పాన్ ఇండియా చిత్రం కరోనా కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. సినిమాకి కొత్త విడుదల తేదీని ఇంకా ప్రకటించలేదు నిర్మాతలు. ఈ నేపథ్యంలో ఈ సినిమాను ప్రముఖ ఓటీటీ సంస్థకి పెద్ద మొత్తానికి విక్రయించారని, త్వరలోనే ఓటీటీ రిలీజ్ డేట్ ప్రకటిస్తారనే వార్తలు కొద్దిరోజులుగా జోరుగా వినిపిస్తున్నాయి. అయితే ఈ రూమర్స్ కు సంగీత దర్శకుడు తమన్ చెక్ పెట్టాడు. ‘

థియేటర్స్‌లోనే ‘రాధేశ్యామ్’

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తాజా చిత్రం ‘రాధేశ్యామ్’  విడుదల కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఈ సంక్రాంతికి విడుదల కావాల్సిన ఈ పాన్ ఇండియా చిత్రం కరోనా కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. సినిమాకి కొత్త విడుదల తేదీని ఇంకా ప్రకటించలేదు నిర్మాతలు. ఈ నేపథ్యంలో ఈ సినిమాను ప్రముఖ ఓటీటీ సంస్థకి పెద్ద మొత్తానికి విక్రయించారని, త్వరలోనే ఓటీటీ రిలీజ్ డేట్ ప్రకటిస్తారనే వార్తలు కొద్దిరోజులుగా జోరుగా వినిపిస్తున్నాయి. అయితే ఈ రూమర్స్ కు సంగీత దర్శకుడు తమన్ చెక్ పెట్టాడు. ‘రాధేశ్యామ్’ థియేటర్స్ లోనే పక్కగా విడుదలవుతుందని క్లారిటీ ఇచ్చాడు. దాంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.


‘రాధేశ్యామ్ థియేటర్స్ లోనే వస్తుంది. మా టీమ్ నుంచి ఎంతో ప్రేమతో..  గ్రాండ్ విజువల్స్, గ్రాండ్ సౌండ్స్,  గ్రాండ్ మేకింగ్ వస్తాయి. మీ అందరితోనూ నేను థియేటర్స్ లోనే ఈ అద్భుతమైన సినిమాను చూస్తాను’... అంటూ తమన్ ట్వీట్ చేసి అభిమానుల్ని ఖుషీ చేశాడు. ‘రాధేశ్యామ్’ చిత్రానికి తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులోని పాటలకి జెస్టిన్ ప్రభాకరన్ తదితరులు ట్యూన్స్ అందించారు. మరి ‘రాధేశ్యామ్’ చిత్రం ఎప్పుడు విడుదలవుతుందో చూడాలి.  



Updated Date - 2022-01-27T14:29:59+05:30 IST