‘పుష్ప’ ట్రైలర్ టీజ్ వచ్చేసింది!
ABN , First Publish Date - 2021-12-04T00:35:21+05:30 IST
అల్లు అర్జున్ హీరోగా ప్యాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ‘పుష్ప’ ట్రైలర్ కోసం అభిమానులు ఎంతో ఆతురతగా ఎదురుచూస్తున్నారు. ఈ నెల 6న ట్రైలర్ను విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ట్రైలర్ రుచి ఎలా ఉండబోతుందో శుక్రవారం సాయంత్రం చిత్ర యూనిట్ చూపించింది.
అల్లు అర్జున్ హీరోగా ప్యాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ‘పుష్ప’ ట్రైలర్ కోసం అభిమానులు ఎంతో ఆతురతగా ఎదురుచూస్తున్నారు. ఈ నెల 6న ట్రైలర్ను విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ట్రైలర్ రుచి ఎలా ఉండబోతుందో శుక్రవారం సాయంత్రం చిత్ర యూనిట్ చూపించింది. ట్రైలర్ టీజ్ పేరుతో ఓ వీడియో విడుదల చేశారు. 26 సెకన్ల నిడివి గల ఈ వీడియోలో సినిమా థీమ్ను, కీలక పాత్రలను చూపించే ప్రయత్నం చేశారు. ఆ సన్నివేశాలన్నీ వీడియోలో అత్యంత వేగంగా సాగుతాయి. పుష్ప అసలు ప్రపంచం చూడాలనుకుంటే వీడియో ప్లే సెట్టింగ్స్లో స్పీడ్ను 0.25కు తగ్గించుకోవాలి. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. రష్మిక మందన్నా కథానాయిక. ఫాహద్ ఫాజిల్, సునీల్, అనసూయ తదితరులు నటిస్తున్న ఈ చిత్రం ఈ నెల 17న ప్రేక్షకుల ముందుకు రానుంది.