‘పుష్ప’ ట్రైలర్ మరింత ఆలస్యం!
ABN , First Publish Date - 2021-12-06T23:55:41+05:30 IST
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ‘పుష్ప’ ట్రైలర్ కోసం ప్రేక్షకులు, అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. సోమవారం సాయంత్రం 6.03 నిమిషాలకు విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు. అయితే కొన్ని కారణాల వల్ల అన్న సమయానికి విడుదల చేయలేకపోతున్నామని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ట్విట్టర్ వేదికగా ప్రకటించింది.
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ‘పుష్ప’ ట్రైలర్ కోసం ప్రేక్షకులు, అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. సోమవారం సాయంత్రం 6.03 నిమిషాలకు విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు. అయితే కొన్ని కారణాల వల్ల అన్న సమయానికి విడుదల చేయలేకపోతున్నామని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ట్విట్టర్ వేదికగా ప్రకటించింది. ట్రైలర్ విడుదల డిలే అయినందుకు క్షమించాలని కోరారు. రష్మిక మందన్నా కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ నెల 17న సినిమా విడుదల కానుంది.