'పుష్ప': త్వరలో సెకండ్ సింగిల్..!

ABN , First Publish Date - 2021-09-28T13:50:25+05:30 IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్నా జంటగా రూపొందుతున్న పాన్ ఇండియన్ సినిమా 'పుష్ప'. ఈ సినిమాకి సుకుమార్ దర్శకుడు. రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా మొదటి భాగం

'పుష్ప': త్వరలో సెకండ్ సింగిల్..!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్నా జంటగా రూపొందుతున్న పాన్ ఇండియన్ సినిమా 'పుష్ప'. ఈ సినిమాకి సుకుమార్ దర్శకుడు. రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా మొదటి భాగం 'పుష్ప ది రైజ్' పేరుతో ఈ ఏడాది చివరిలో క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా ‘పుష్ప’ సినిమా నుంచి ఓ అప్డేట్‌ని చిత్రబృందం ప్రకటించింది. ఇందులోని ఓ సాంగ్ అద్భుతమైన లొకేషన్స్‌లో చిత్రీకరణ జరుపుకుంది.. అంటూ ఒక ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.


అలాగే అతి త్వరలో ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్‌కు సంబంధించిన అప్డేట్‌ను కూడా ప్రకటించబోతున్నట్టు మేకర్స్ తెలిపారు. ఇక ఇప్పటికే 'పుష్ప' నుంచి విడుదలైన ఫస్ట్ సింగిల్ 'దాక్కో దాక్కో మేక'కు మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను  ముత్తంశెట్టి మీడియా వారితో కలిసి మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవి శంకర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 



Updated Date - 2021-09-28T13:50:25+05:30 IST