పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)తో బద్రి (Badri) సినిమా తీసి ఒక్కసారిగా టాలీవుడ్లో సంచలనం సృష్ఠించారు పూరి జగన్నాధ్ (Puri Jagannath). ఆ తర్వాత పక్కా మాస్ ఎంటర్టైనర్స్ తీస్తూ డాషింగ్ డైరెక్టర్గా అసాధారణమైన క్రేజ్ను సంపాదించుకున్నారు. దర్శకుడిగా మాత్రమే కాకుండా వైష్ణో అకాడమీ (Vaishno Academy), పూరి కనెక్ట్స్ (Puri Connects) సంస్థలను స్థాపించి సొంతగా సినిమాలను నిర్మిస్తున్నారు పూరి. అయితే, ఇప్పుడు పూరి తనయ పవిత్ర (Puri Pavithra) టాలీవుడ్లో నిర్మాతగా ఎంట్రీ ఇవ్వబోతుందని వార్తలు వస్తున్నాయి.
ఇప్పటికే, పూరి కొడుకు ఆకాష్ పూరి హీరోగా పరిచయమై నెమ్మదిగా నిలదొక్కుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. తండ్రి దర్శకత్వంలోనే 'మెహబూబా' సినిమాతో హీరోగా మారిన ఆకాష్, ఆ తర్వాత 'రొమాంటిక్' సినిమాతో వచ్చి ఆకట్టుకున్నాడు. ఈ సినిమాలు సక్సెస్ కాకపోయినా కూడా పర్ఫార్మెన్స్ పరంగా ఆకాష్ మంచి పేరు తెచ్చుకున్నాడు. పూరి ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఆకాష్ ఫ్యూచర్లో పెద్ద కమర్షియల్ హీరో అవుతాడని ఇండస్ట్రీ వర్గాలు నమ్మకంగా చెబుతున్నాయి.
ఈ క్రమంలోనే పూరి కూతురు పవిత్ర ప్రొడక్షన్ వైపు అడుగులు వేయబోతుందట. ప్రస్తుతం ఛార్మితో కలిసి పూరి కనెక్ట్స్ బ్యానర్ను స్థాపించిన పూరి, భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మిస్తున్నారు. ఈ సంస్థ నుంచి ఇదే ఏడాది విజయ్ దేవరకొండ - అనన్య పాండే జంటగా నటించిన పాన్ ఇండియా చిత్రం 'లైగర్' రాబోతోంది. అలాగే, పూరి డ్రీమ్ ప్రాజెక్ట్ 'జనగణమన' విజయ్ దేవరకొండతో రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పాన్ ఇండియన్ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. ఈ మూవీని వచ్చే ఏడాది రిలీజ్ చేనునున్నారు. అయితే, పూరి కనెక్ట్స్ నిర్మాణ సంస్థ బాధ్యతలను పవిత్రకు అప్పగించబోతున్నట్టు టాక్ వినిపిస్తోంది. త్వరలో దీనిపై క్లారిటీ రాబోతుందట. ఇప్పటికే టాలీవుడ్లో ప్రముఖ నిర్మాతల వారసులు నిర్మాతలుగా మారిన సంగతి తెలిసిందే.