'ప్రాజెక్ట్ k' 90% రామోజీ ఫిలిం సిటీలోనే..?
ABN , First Publish Date - 2021-07-28T15:45:25+05:30 IST
పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ 'ప్రాజెక్ట్ K' ఇటీవల ప్రారంభయిన సంగతి తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం ఈ మూవీ చిత్రీకరణ 90% రామోజీ ఫిలిం సిటీలోనే పూర్తి చేయనున్నారట. మహా నటి ఫేం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో 'ప్రాజెక్ట్ k'
పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ 'ప్రాజెక్ట్ K' ఇటీవల ప్రారంభయిన సంగతి తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం ఈ మూవీ చిత్రీకరణ 90% రామోజీ ఫిలిం సిటీలోనే పూర్తి చేయనున్నారట. మహా నటి ఫేం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో 'ప్రాజెక్ట్ k' అనే వర్కింగ్ టైటిల్తో తెరకెక్కుతున్న సైన్స్ ఫిక్షన్ సినిమాలో దీపిక పదుకొణ్, బిగ్ బి అమితాబ్ బచ్చన్ ముఖ్య పాత్రల్లో నటిస్తుండగా, ప్రస్తుతం అమితాబ్పై సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. దాదాపు 500 కోట్ల భారీ బడ్జెట్తో ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ నిర్మిస్తోంది. లెజండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాస రావు ఈ మూవీకి క్రియేటివ్ హెడ్గా వ్యవహరిస్తున్నారు. అయితే ఈ సినిమాకి సంబంధించిన సెట్స్ మొత్తం రామోజీ ఫిల్మ్ సిటీలోనే నిర్మించారట. 'ప్రాజెక్ట్ K' కి సంబంధించిన 90 శాతం షూటింగ్ ఇక్కడే జరపనున్నట్టు తెలుస్తోంది. మిక్కే జె మేయర్ సంగీతం అందిస్తున్నాడు. ఇందులో ఎంతవరకు నిజముందో తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే.