ఓటీటీలో నాగచైతన్య ఎంట్రీ పక్కా... నిర్మాత ఎవరంటే?
ABN , First Publish Date - 2021-07-23T16:51:23+05:30 IST
మారుతున్న ట్రెండ్కు అనుగుణంగా వెండితెరపై సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న స్టార్స్లో చాలా మంది ఇప్పటికే ఓటీటీల్లో నటించారు. ఈ క్రమంలో స్టార్ హీరోల్లో ఒకరైన అక్కినేని నాగచైతన్య త్వరలోనే ..
వెండితెరతో పోటీ పడుతూ డిజిటల్ మాధ్యమం దూసుకొస్తోంది. మారుతున్న ట్రెండ్కు అనుగుణంగా వెండితెరపై సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న స్టార్స్లో చాలా మంది ఇప్పటికే ఓటీటీల్లో నటించారు. ఈ క్రమంలో స్టార్ హీరోల్లో ఒకరైన అక్కినేని నాగచైతన్య త్వరలోనే డిజిటల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ప్రముఖ నిర్మాత శరత్ మరార్ చైతన్య ఓటీటీ ప్రాజెక్ట్ కోసం చాలా కథలను విని కొన్నింటిని ఫైనలైజ్ చేశారట. అందులో ఓ స్క్రిప్ట్కు చైతన్య ఓకే చెబితే చాలు.. ప్రాజెక్ట్స్ ముందుకు కదులుతుందట. ప్రస్తుతం ‘థాంక్యూ, లాల్సింగ్ చద్దా’ సినిమాలతో బిజీగా ఉన్న చైతు.. తర్వాత ‘బంగార్రాజు’ షూటింగ్ను షురూ చేస్తాడు. అది పూర్తయిన తర్వాత ఓటీటీ ప్రాజెక్ట్ను సెట్స్పైకి తీసుకెళ్లేలా ఆలోచనలు జరుగుతున్నాయని టాక్ వినిపిస్తోంది.