Priyamani: సోషల్ మీడియా సమస్యలతో ప్రియమణి ఫైట్
ABN , First Publish Date - 2022-10-20T15:09:59+05:30 IST
టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు మంచి పాపులారిటీ ఉన్న నటీమణుల్లో ప్రియమణి (Priyamani) ఒకరు. తాజాగా ఈ బ్యూటీ ప్రధాన పాత్రలో..
టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు మంచి పాపులారిటీ ఉన్న నటీమణుల్లో ప్రియమణి (Priyamani) ఒకరు. తాజాగా ఈ బ్యూటీ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘డీఆర్ 56’ (DR 56). సైన్స్ ఫిక్షన్ జోనర్లో ఈ మూవీ తెరకెక్కింది. శ్రీ లక్ష్మిజ్యోతి క్రియేషన్స్ బ్యానరుపై నిర్మాత ఏఎన్.బాలాజీ సమర్పణలో హరి హర పిక్చర్స్ తమిళ, కన్నడ భాషల్లో ద్విభాషా చిత్రాన్ని నిర్మించింది. జేష్ ఆనంద్ లీలా దర్శకత్వం వహించారు. డిసెంబరు 9న తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్కు సిద్ధమైంది. ప్రియమణితో పాటు ప్రవీణ్, దీపక్ రాజ్ షెట్టి, రమేష్ భట్, యతిరాజ్, వీణా పొన్నయ్యన్, మంజునాథ్ హెగ్డే, స్వాతి తదితరులు నటించారు. చిత్రం గురించి దర్శకుడు మాట్లాడుతూ.. ‘సోషల్ మీడియా (Social Media) ద్వారా వెలుగులోకి వచ్చే అనేక అంశాలను నేపథ్యంగా చేసుకుని స్ర్కీన్ప్లే రూపొందించాం. వివాహం తర్వాత ప్రియమణి నటించిన తొలి తమిళ చిత్రం ఇదే. రెండు భాషల్లో ఏకకాలంలో నిర్మించడంతో షూటింగ్ సమయంలో అనేక సవాళ్లను ఎదుర్కొన్నాం. డిసెంబరు 9వ తేదీన అన్ని చోట్ల విడుదల చేయనున్నాం’ అని వివరించారు.
కాగా.. ఈ మూవీ ఫస్ట్ లుక్ని ప్రముఖ తమిళ నటుడు విజయ్ సేతుపతి (Vijay Sethupathi) విడుదల చేశారు. ‘భామా కలాపం’ సక్సెస్ తర్వాత ప్రియమణి నటించిన చిత్రం ఇదే. అలాగే.. ఈ బ్యూటీ ప్రస్తుతం ‘సైనెడ్’ అనే చిత్రంలో నటించనుంది. ఆ చిత్రానికి వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ త్వరలో విడుదల కానుంది.