కోషి కురియన్‌ను డేనియల్ శేఖర్ కలిసిన వేళ!

ABN , First Publish Date - 2021-12-06T17:51:14+05:30 IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా ప్రధాన పాత్రల్లో సాగర్ కె చంద్ర దర్శకత్వంలో రూపొందుతోన్న యాక్షన్ థ్రిల్లర్ భీమ్లా నాయక్. మలయాళ సూపర్ హిట్ మూవీ ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ చిత్రానికిది అఫీషియల్ రీమేక్ అన్న సంగతి తెలిసిందే. త్రివిక్రమ్ ఈ సినిమాకి స్ర్కీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది జనవరి 12న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా విడుదల కాబోతోంది. ఇక ఒరిజినల్ వెర్షన్ లో కోషిగా పృధ్విరాజ్ సుకుమారన్ అద్భుతంగా నటించారు.

కోషి కురియన్‌ను డేనియల్ శేఖర్ కలిసిన వేళ!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా ప్రధాన పాత్రల్లో సాగర్ కె చంద్ర దర్శకత్వంలో రూపొందుతోన్న యాక్షన్ థ్రిల్లర్ భీమ్లా నాయక్. మలయాళ సూపర్ హిట్ మూవీ ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ చిత్రానికిది అఫీషియల్ రీమేక్ అన్న సంగతి తెలిసిందే. త్రివిక్రమ్ ఈ సినిమాకి స్ర్కీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 12న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా విడుదల కాబోతోంది. ఇక ఒరిజినల్ వెర్షన్ లో కోషిగా పృధ్విరాజ్ సుకుమారన్ అద్భుతంగా నటించారు. దానికి తగ్గట్టుగానే ఆ పాత్రను తెలుగులో డేనియల్ శేఖర్ గా రానా అభినయిస్తున్నారు. ఇంతకు ముందు రానా బర్త్ డేకి విడుదలైన ‘భీమ్లా నాయక్’ టీజర్ లో రానా నటనని పృధ్విరాజ్ ఎంతగానో అప్రిషియేట్ చేశారు.  ఆ పాత్రని మరింత మాస్ గా రానా ప్రెజెంట్ చేశారని ప్రశంసించారు. 


తాజాగా కోషి కురియన్ , డేనియల్ శేఖర్ పాత్రధారులు కలుసుకొన్న ఒక పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రస్తుతం పృధ్విరాజ్ సుకుమారన్, మోహన్ లాల్ హీరోగా బ్రోడాడీ అనే మూవీకి దర్వకత్వం వహిస్తున్నారు. కామెడీ సెటైరికల్ మూవీగా తెరకెక్కుతోంది. ఈ సినిమా సెట్స్ లోనే కోషి పాత్రధారి పృధ్వీరాజ్, డేనియల్ శేఖర్ పాత్రధారి రానా కలుసుకొని ముచ్చటించుకున్నారు. వీరిద్దరి మధ్యా సరదా సంభాషణ జరిగింది. ఆ సందర్భాన్ని కోట్ చేస్తూ పృధ్విరాజ్ ఈ పిక్ ను తన అఫీషియల్ ఫేస్ బుక్ పేజ్ లో పోస్ట్ చేశారు. దీంతో అభిమానులు మరింత ఖుషీ అవుతున్నారు. 



Updated Date - 2021-12-06T17:51:14+05:30 IST