యూత్ఫుల్ ఎంటర్టైనర్
ABN , First Publish Date - 2022-08-13T06:10:52+05:30 IST
త్రిగుణ్, మేఘాఆకాష్ జంటగా నటిస్తున్న చిత్రం ‘ప్రేమదేశం’. మధుబాల ప్రత్యేకపాత్ర లో నటిస్తున్నారు. శ్రీకాంత్ సిద్ధమ్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు.
త్రిగుణ్, మేఘాఆకాష్ జంటగా నటిస్తున్న చిత్రం ‘ప్రేమదేశం’. మధుబాల ప్రత్యేకపాత్ర లో నటిస్తున్నారు. శ్రీకాంత్ సిద్ధమ్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. శిరీష సిద్ధమ్ నిర్మిస్తున్నారు. కాలేజ్ నేపథ్యంలో యూత్ఫుల్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోన్న చిత్రం ఇది. షూటింగ్ ముగింపు దశలో ఉంది. సెప్టెంబరులో విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఇటీవలె చిత్రబృందం ‘ప్రేమదేశం’ టీజర్ను విడుదల చేసింది. ‘‘1996లో విడుదలైన ‘ప్రేమదేశం’ చిత్రం అప్పట్లో పెద్ద హిట్. ఏ. ఆర్. రెహమాన్ సంగీతం ప్రేక్షకులను అమితంగా అలరించింది. ఇప్పుడు మణిశర్మ అద్భుతమైన బ్యాగ్రౌండ్ స్కోర్తో ఈ సినిమాకు ప్రాణం పోశాడు’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. తనికెళ్ల భరణి, మాయ, అజయ్ కతుర్వార్ ముఖ్యపాత్రల్లో నటించారు.