Prabhas : ఆన్ లొకేషన్ ‘ఆదిపురుష్’

ABN , First Publish Date - 2021-09-27T13:58:22+05:30 IST

రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా మూవీ ‘ఆదిపురుష్’ షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉన్నారు. ముంబైలో ప్రత్యేకంగా వేసిన సెట్ లో ఈ మూవీ షూటింగ్ జరుగుతోంది. గ్రీన్ మ్యాట్ లో అధిక శాతం చిత్రీకరణ జరుపుకుంటోంది.

Prabhas : ఆన్ లొకేషన్ ‘ఆదిపురుష్’

రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా మూవీ ‘ఆదిపురుష్’  షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉన్నారు.   ముంబైలో ప్రత్యేకంగా వేసిన సెట్ లో ఈ మూవీ షూటింగ్ జరుగుతోంది. గ్రీన్ మ్యాట్ లో అధిక శాతం చిత్రీకరణ జరుపుకుంటోంది. దాదాపు రూ. 500 కోట్ల బడ్జెట్ తో మోషన్ కేప్చర్ టెక్నాలజీతో కనీవినీ ఎరుగని రీతిలో రూపొందుతోంది. అయినప్పటికీ సినిమాను ఈ ఏడాది చివరికి ముగించేలా ప్లాన్ చేస్తున్నారు. హాలీవుడ్ విఎఫ్ఎక్స్ ఎక్స్పెర్ట్స్ ఈ మూవీకి పనిచేస్తున్నట్టుగా తెలుస్తోంది. విభిన్న కోణంలో రామాయణ ఇతిహాసాన్ని కళ్ళకు కట్టే ప్రయత్నం చేస్తున్నారు దర్శకుడు ఓం రౌత్. 


ఇక ఈ సినిమా ప్రారంభం నుంచి ఆన్ లొకేషన్ స్టిల్స్ రివీల్ అవుతునే ఉన్నాయి. కానీ వారు సినిమాకి సంబంధించిన కాస్ట్యూమ్స్ తో మాత్రం కనిపించడం లేదు. రీసెంట్ గా ‘ఆదిపురుష్’ లో లక్ష్మణుడి పాత్రధారి సన్ని సింగ్ సెల్ఫీ పిక్ .. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ పిక్ లో  రాముడు పాత్రధారి ప్రభాస్ తో పాటు.. దర్శకుడు , ఓం రౌత్, సన్నిసింగ్ రివీల్ అయ్యారు. షూటింగ్ లో బ్రేక్ లేకుండా పాల్గొంటున్న ప్రభాస్ ఈ సినిమా షూటింగ్ కోసం కష్టపడుతున్నారు. వచ్చే ఏడాది ‘ఆదిపురుష్’ మూవీని విడుదల చేస్తున్నారు.

Updated Date - 2021-09-27T13:58:22+05:30 IST