Pooja hegde: చరణ్, తారక్‌లపై ఇంట్రెస్టింగ్ పోస్ట్..

ABN , First Publish Date - 2021-12-07T14:20:37+05:30 IST

బుట్టబొమ్మ, మోస్ట్ వాంటెడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ పూజా హెగ్డే.. మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్‌లపై.. అలాగే పాన్ ఇండియన్ మూవీ 'ఆర్ఆర్ఆర్' మూవీపై సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

Pooja hegde: చరణ్, తారక్‌లపై ఇంట్రెస్టింగ్ పోస్ట్..

బుట్టబొమ్మ, మోస్ట్ వాంటెడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ పూజా హెగ్డే.. మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్‌లపై.. అలాగే పాన్ ఇండియన్ మూవీ 'ఆర్ఆర్ఆర్' మూవీపై సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. దర్శక దిగ్గజం రాజమౌళి తెరకెక్కించిన 'ఆర్ఆర్ఆర్' మూవీ కోసం ప్రపంచవ్యాప్తంగా అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసున్నారు. శక్తివంతమైన ఇద్దరు పోరాట యోధులైన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు, కొమురమ్ భీమ్ పాత్రల్లో చరణ్, తారక్ నటిస్తుండటంతో అందరిలోనూ ఊహించని విధంగా అంచనాలు నెలకొన్నాయి. కొత్త సంవత్సరంలో సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 7న రిలీజ్ కానున్న ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా రామరాజు, భీమ్ పాత్రలకు సంబంధించిన ఇంటెన్సివ్ పోస్టర్స్‌ను మేకర్స్ రిలిజ్ చేశారు. 


ఇలా మేకర్స్ రిలీజ్ చేస్తున్న ఒక్కో పోస్టర్‌తో సినిమాపై మరిన్ని అంచనాలు పెరుగుతున్నాయి. ఈ సందర్భంగా స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే స్పందించింది. "రాజమౌళి చేసిన ఈ ఎమోషనల్ డ్రైవ్‌ను చూసేందుకు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని, రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్‌లు ఇద్దరూ కూడా ఫెంటాస్టిక్‌గా కనిపిస్తున్నారని.. ఇద్దరినీ కూడా స్క్రీన్ మీద చూడాలని మరింత ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను" అంటూ పూజా హెగ్డే ఎంతో ఎగ్జైట్ అవుతూ తన ట్విట్టర్ ఖాతాలో తాజాగా ఓ పోస్ట్ పెట్టింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట చక్కర్లు కొడుతూ వైరల్ అవుతోంది. కాగా, పూజా హెగ్డే ప్రభాస్ సరసన నటించిన పీరియాడిక్ రొమాంటిక్ డ్రామా 'రాధే శ్యామ్' సంక్రాంతి కానుకగా జనవరి 14న రిలీజ్ కానుంది. 



Updated Date - 2021-12-07T14:20:37+05:30 IST