Cannes Film Festival 2022: నేను బ్రాండ్‌గా రాలేదు.. బ్రాండ్ ఇండియాతో వచ్చానంటున్న Pooja Hegde

ABN , First Publish Date - 2022-05-20T17:44:55+05:30 IST

అంతర్జాతీయంగా అత్యంత ప్రతిష్టాత్మక ఫిల్మ్ ఫెస్టివల్‌గా పేరుగాంచిన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ (Cannes Film Festival) 2022 వేడుకలు జరుగుతున్న...

Cannes Film Festival 2022: నేను బ్రాండ్‌గా రాలేదు.. బ్రాండ్ ఇండియాతో వచ్చానంటున్న Pooja Hegde

అంతర్జాతీయంగా అత్యంత ప్రతిష్టాత్మక ఫిల్మ్ ఫెస్టివల్‌గా పేరుగాంచిన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ (Cannes Film Festival) 2022 వేడుకలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో ఎందరో భారతీయ సినీ తారలు భారతదేశం ప్రతినిధులుగా పాల్గొన్న విషయం తెలిసిందే. అందులో వరుసగా స్టార్స్ సినిమాలు చేస్తూ టాలీవుడ్ (Tollywood), కోలీవుడ్‌ (Kollywood)తోపాటు బాలీవుడ్‌‌లోనూ గుర్తింపు పొందిన పూజా హెగ్డే కూడా ఉంది. ఈ బ్యూటీ తాజాగా కేన్స్ రెడ్ కార్పెట్‌పై ఇండియా తరుఫున అడుగుపెట్టింది. గేయన్నా యూనెస్ గౌన్‌లో ఎంతో అందంగా కనిపించి అందరి మనసులను కొల్లగొట్టింది.


ఈ సందర్భంగా పూజా మాట్లాడుతూ.. ‘నేను కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కి బ్రాండ్‌‌గా రాలేదు.. కానీ బ్రాండ్ ఇండియాతో వచ్చాను. నేను భారతదేశానికి ప్రతినిధిగా మాత్రమే ఇక్కడికి వచ్చాను. ఇలాంటి ప్రతిష్టాత్మక ఫిల్మ్ ఫెస్టివల్‌లో భారతీయ యాక్టర్‌గా భారతీయ సినిమా, ఇండియాకి ప్రాతినిథ్యం వహించడం కంటే పెద్ద గౌరవం నాకు మరొకటి ఉండదు’ అంటూ చెప్పుకొచ్చింది. పూజా ఇంకా మాట్లాడుతూ.. ‘కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లాంటి  ప్రతిష్టాత్మకమైన వేదికపై భారతీయ సినిమాకు ప్రాతినిధ్యం వహించాలనే కల ఈ రోజుకి నిజమైంది. నా కెరీర్‌లో మంచి దిశలోనే వెళుతుందనే దానికి ఇదే గొప్ప ఉదాహరణ’ అని తెలిపింది.


కాగా.. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ అయిపోగానే.. సల్మాన్ ఖాన్ ‘కభీ ఈద్ కభీ దీవాళి’ షూటింగ్‌‌లో పాల్గొంటుంది. ఈ మూవీ టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేశ్ కూడా నటిస్తుండడం విశేషం. అంతేకాకుండా త్వరలో ప్రారంభం కానున్న మహేష్ బాబు, త్రివిక్రమ్‌తో మూవీ SSMB28లో నటించనుంది.





Updated Date - 2022-05-20T17:44:55+05:30 IST