విక్కీ కౌశల్, Katrina Kaif పెళ్లికి అతిథులుగా పీఏమ్‌వో అధికారులు

ABN , First Publish Date - 2021-12-02T01:34:17+05:30 IST

విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ డిసెంబర్ 9న పెళ్లి చేసుకోబోతున్నారని బీ టౌన్ మీడియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

విక్కీ కౌశల్, Katrina Kaif పెళ్లికి అతిథులుగా పీఏమ్‌వో అధికారులు

విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ డిసెంబర్ 9న పెళ్లి చేసుకోబోతున్నారని బీ టౌన్ మీడియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. వీరి వివాహం 3రోజుల పాటు జరగనుందని తెలుస్తోంది. పెళ్లి ఏర్పాట్లను ఒక ఈవెంట్ మెనేజ్‌మేంట్ కంపెనీకి ఈ జంట అప్పగించింది. ప్రస్తుతం ఆ సంస్థ వివాహ ఏర్పాట్లలో బిజిగా ఉంది. అతి రథ మహారథులందరూ వీరి పెళ్లికి హాజరుకాబోతున్న గెస్ట్ లిస్ట్‌లో ఉన్నారు. 


బాలీవుడ్ నుంచి దర్శకులు, నిర్మాతలు, నటులతో పాటు ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్‌( పీఏమ్‌వో )కు చెందిన అధికారులు హాజరుకాబోతున్నట్టు తెలుస్తోంది. ఈ విషయంపై ఇప్పటికే  పీఏమ్‌వో ఆఫీస్ నుంచి కలెక్టర్‌కు సమాచారం అందిందని మీడియా తెలుపుతోంది. పీఏమ్‌వో నుంచి 5 అధికారులు వీరి పెళ్లి జరిగే సవాయ్ మాధోపూర్‌కి రానున్నట్టు సమాచారం. రూట్ మ్యాప్ ఇంకా ఖరారు కావాల్సి ఉంది. పెళ్లికి రాబోయే అతిథుల కోసం పులి, మొసళ్ల స్వారీని ఏర్పాటు చేస్తున్నట్లు బీ టౌన్ మీడియా తెలుపుతోంది. సిక్స్ సెన్సెస్ ఆఫ్ ఫోర్ట్‌కు చెందిన యాజమాన్యం వీటి కోసం ఇప్పటికే ప్రణాళిక సిద్దం చేసినట్టు తెలుస్తోంది.  

Updated Date - 2021-12-02T01:34:17+05:30 IST