సీతారామశాస్త్రిగారి మరణం నన్నెంతగానో బాధించింది: ప్రధాని మోదీ

ABN , First Publish Date - 2021-12-01T01:14:14+05:30 IST

అత్యంత ప్రతిభావంతులైన సిరివెన్నెల సీతారామశాస్త్రిగారి మరణం నన్నెంతగానో బాధించింది అంటూ ట్వీట్ చేశారు దేశ ప్రధాని నరేంద్ర మోదీ. ట్విట్టర్ వేదికగా.. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ చేతుల మీదుగా సిరివెన్నెల సీతారామశాస్త్రి

సీతారామశాస్త్రిగారి మరణం నన్నెంతగానో బాధించింది: ప్రధాని మోదీ

అత్యంత ప్రతిభావంతులైన సిరివెన్నెల సీతారామశాస్త్రిగారి మరణం నన్నెంతగానో బాధించింది అంటూ ట్వీట్ చేశారు దేశ ప్రధాని నరేంద్ర మోదీ. ట్విట్టర్ వేదికగా.. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ చేతుల మీదుగా సిరివెన్నెల సీతారామశాస్త్రి పద్మశ్రీ పురస్కారం అందుకుంటున్న ఫొటోని పోస్ట్ చేసిన ఆయన.. సిరివెన్నెల కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియపరిచారు.


‘‘అత్యంత ప్రతిభావంతులైన సిరివెన్నెల సీతారామశాస్త్రిగారి మరణం నన్నెంతగానో బాధించింది. ఆయన రచనలలో కవిత్వ పటిమ, బహుముఖ ప్రజ్ఞ గోచరిస్తుంది. తెలుగు భాషా ప్రాచుర్యానికి ఎంతగానో కృషి చేసారు. ఆయన కుటుంబసభ్యులకు, స్నేహితులకు సంతాపాన్ని తెలియజేస్తున్నాను. ఓం శాంతి..’’ అని నరేంద్ర మోదీ ట్వీట్‌లో పేర్కొన్నారు.



Updated Date - 2021-12-01T01:14:14+05:30 IST