24న తెరపైకి రియోరాజ్, రమ్యా నంబీశన్ల చిత్రం
ABN , First Publish Date - 2021-09-21T01:44:48+05:30 IST
పాజిటివ్ స్టూడియోస్ పతాకంపై ఎల్. చంద్రన్, రాజేష్ కుమార్ నిర్మాణంలో రియోరాజ్, రమ్యా నంబీశన్ జంటగా నటించిన చిత్రం ‘ప్లాన్ పణ్ణి పణ్ణనుమ్’. బద్రి వెంకటేష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఈనెల 24వ తేదీన థియేటర్లలో
పాజిటివ్ స్టూడియోస్ పతాకంపై ఎల్. చంద్రన్, రాజేష్ కుమార్ నిర్మాణంలో రియోరాజ్, రమ్యా నంబీశన్ జంటగా నటించిన చిత్రం ‘ప్లాన్ పణ్ణి పణ్ణనుమ్’. బద్రి వెంకటేష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఈనెల 24వ తేదీన థియేటర్లలో రిలీజ్ చేయనున్నారు. ఈ సందర్భంగా శనివారం రాత్రి చిత్ర బృందం ప్రీ-రిలీజ్ ఈవెంట్ను నిర్వహించింది. ఇందులో హీరో రియోరాజ్ మాట్లాడుతూ.. ‘ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం సమకూర్చారు. ఇది నా జీవితంలో ఒక కల. అది నెరవేరింది. కోవిడ్ సమయంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఈ చిత్రం షూటింగ్ను విజయవంతంగా పూర్తిచేశారు. కరోనా లాక్డౌన్తో ప్రతి ఒక్కరూ తీవ్రమైన మానసిక ఒత్తిడిని ఎదుర్కొన్నారు. దీనికితోడు ఆర్థికంగా చితికిపోయారు. ఈ చిత్రం ప్రతి ఒక్కరినీ కడుపుబ్బ నవ్విస్తుంది. ప్రతి ఒక్కరినీ ఎంటర్టైన్ చేస్తుంది’ అని తెలిపారు.
హీరోయిన్ రమ్యా నంబీశన్ మాట్లాడుతూ.. ‘థియేటర్లు తెరుచుకోవడం మా బృందానికి ఎంతో సంతోషంగా ఉంది. ఇది ప్రతి ఒక్కరికీ ఎంతో కష్టమైన కాలం. లాక్డౌన్ సమయంలో ఓటీటీలకు ఆదరణ పెరిగింది. అయితే, సినిమా థియేటర్లో చూసిన అనుభూతి ఓటీటీలో లభించదు ఈ చిత్రాన్ని ప్రతి ఒక్కరూ చూసి మద్దతు తెలపాలని కోరుకుంటున్నాను’ అని తెలపగా.. దర్శకుడు బద్రి వెంకటేష్ మాట్లాడుతూ.. ‘ఈ చిత్ర హీరో రియోరాజ్తో మున్ముందు పలు చిత్రాలు చేయాలని భావిస్తున్నాను. దానికి కారణం మంచి నటుడు కావడమే. హీరోయిన్ రమ్యా నంబీశన్ చాలా బాగా నటించింది. ఇది వందకు వంద శాతం కామెడీ చిత్రం..’ అని వివరించారు. ఈ కార్యక్రమంలో డీవోపీ బి.రాజశేఖర్, హాస్య నటుడు బాలశరవణన్, సీనియర్ నటి పూర్ణిమ రవి, నిర్మాత రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.