Pawan kalyan: నానిని అంటుంటే చాలా బాధేసింది

ABN , First Publish Date - 2021-09-26T15:58:29+05:30 IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా జరిగిన 'రిపబ్లిక్' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ముఖ్య అథిదిగా హాజరైన విషయం తెలిసిందే. ఆయన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ హీరోగా, టాలెంటెడ్ డైరెక్టర్ దేవా కట్టా దర్శకత్వంలో

Pawan kalyan: నానిని అంటుంటే చాలా బాధేసింది

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా జరిగిన 'రిపబ్లిక్' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ముఖ్య అతిథిగా హాజరైన విషయం తెలిసిందే. ఆయన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ హీరోగా, టాలెంటెడ్ డైరెక్టర్ దేవా కట్టా దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కింది. ఐశ్వర్య రాజేశ్ హీరోయిన్. జీ స్టూడియోస్‌ పతాకంపై జె. భగవాన్‌, జె. పుల్లారావు సంయుక్తంగా నిర్మించారు. అక్టోబరు 1న భారీ స్థాయిలో విడుదలకానుంది. ఈ నేపథ్యంలో గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను చిత్రబృందం నిర్వహించింది. ఈ ఈవెంట్‌లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇచ్చిన స్పీచ్ ఎవరూ ఊహించలేదు. తెలుగు సినిమా ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న సమస్యలపై మాట్లాడిన ఆయన సినిమా రిలీజ్ విషయంలో ఇబ్బందులు పెడుతున్న వారిని ఏకిపారేశారు.


ఒక్క పవన్ కళ్యాణ్ మీద ఉన్న కోపంతో మిగతా హీరోల సినిమాలను కూడా రిలీజ్ కానివ్వకుండా ఇబ్బందులు పెడతారా.. అంటూ ప్రశ్నించారు. ముఖ్యంగా ఏపీ మంత్రులపై విమర్శల అస్త్రాలను విసిరారు. "మీకు నాతో సమస్య ఉంటే నా సినిమాలు ఆపండి..కానీ మా వాళ్ళ సినిమాలను వదిలేయండి".. అన్నారు. మాకు ఊరికే డబ్బులు రావడం లేదని, 'బాహుబలి' కోసం ప్రభాస్ కండలు పెంచితే, ఎన్.టి.ఆర్ ఎంతో ఎంతో కష్టపడి డాన్సులు చేసి జనాలను ఎంటర్‌టైన్ చేస్తే డబ్బులొస్తున్నాయని మాట్లాడారు. ఇదే సమయంలో మొన్నామధ్య కొందరు నానిని విమర్శించారు. అది నాకు చాలా బాధకలిగించింది.


తనేదో ఒక సినిమా చేసుకున్నాడు. కరోనా కారణంగా థియేటర్స్ మూతపడితే దానికి తనేం చేస్తాడు. నిర్మాతల శేయస్సు కోరే ఓటీటీలో తను నటించిన 'టక్ జగదీష్' రిలీజ్ చేశారు. అందుకు నానిని అంటే ఎలా..ఇలా ఒక సినిమా ఓటీటీకి వెళ్ళిందంటే అందుకు కారణమైన వారిని కదా అనాలి. అంటూ నేచురల్ స్టార్ నానికి పూర్తి మద్దతు ఇస్తూ మాట్లాడారు పవన్ కళ్యాణ్. దీంతో నాని అభిమానులు, ఇండస్ట్రీలోని ప్రతీఒక్కరు హర్షం వ్యక్తం చేస్తున్నారు.  

Updated Date - 2021-09-26T15:58:29+05:30 IST