ముగ్గురు హీరోలతో మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్న పరశురామ్..?

ABN , First Publish Date - 2022-01-09T13:16:11+05:30 IST

దర్శకుడు పరశురామ్ ముగ్గురు హీరోలతో మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్నాడా..! ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇదే వార్త వచ్చి వైరల్ అవుతోంది. గత చిత్రం 'గీత గోవిందం'తో రూ.100 కోట్ల మార్క్‌ను టచ్ చేశారు పరశురామ్.

ముగ్గురు హీరోలతో మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్న పరశురామ్..?

దర్శకుడు పరశురామ్ ముగ్గురు హీరోలతో మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్నాడా..! ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇదే వార్త వచ్చి వైరల్ అవుతోంది. గత చిత్రం 'గీత గోవిందం'తో రూ.100 కోట్ల మార్క్‌ను టచ్ చేశారు పరశురామ్. ప్రస్తుతం ఆయన సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా 'సర్కారు వారి పాట' అనే స్టైలిష్ యాక్షన్ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. కీర్తి సురేశ్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ చివరి దశలో ఉంది. ఏప్రిల్ 1వ తేదీన భారీ స్థాయిలో రిలీజ్ చేయనున్నట్టు ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. ఇక ఈ సినిమా తర్వాత ముగ్గురు స్టార్ హీరోలతో భారీ మల్టీస్టారర్ చిత్రాన్ని పాన్ ఇండియన్ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారని సమాచారం. మరి ఎంతవరకు నిజమో తెలీదు గానీ, ఈ వార్త మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కాగా, అక్కినేని నాగ చైతన్య హీరోగా 14 రీల్స్ సంస్థలో ఓ సినిమా చేయాల్సి ఉంది పరశురామ్. మరి ఏది ముందు పట్టాలెక్కుతుందో చూడాలి. 

Updated Date - 2022-01-09T13:16:11+05:30 IST