'పక్కా కమర్షియల్' ఓటీటీ రైట్స్ ఎవరికంటే..
ABN , First Publish Date - 2022-04-06T15:08:35+05:30 IST
గోపీచంద్, రాశి ఖన్నా జంటగా నటిస్తున్న తాజా చిత్రం 'పక్కా కమర్షియల్'. మారుతీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జూలైలో రిలీజ్ కానుంది. అయితే, ఈ సినిమాకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
గోపీచంద్, రాశి ఖన్నా జంటగా నటిస్తున్న తాజా చిత్రం 'పక్కా కమర్షియల్'. మారుతీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జూలైలో రిలీజ్ కానుంది. అయితే, ఈ సినిమాకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ తెలుగు డిజిటల్ ప్లాట్ఫాం ఆహా దక్కించుకుంది. ఇందుకోసం భారీ మొత్తమే చెల్లించినట్టు తెలుస్తోంది. ఈ సినిమా థియేటర్లలో విడుదలైన కొద్ది వారాలకే ఆహా వీడియోలో స్ట్రీమింగ్ కానుందట. జేక్స్ బిజోయ్ సంగీతం అందించిన ఈ మూవీలో సత్యరాజ్, అనసూయ భరద్వాజ్, రావు రమేష్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ప్రముఖ నిర్మాణ సంస్థలు యువి క్రియేషన్స్ - జీఏ2 పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రం జూలై 1, 2022 న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇటీవల కాలంలో సరైన హిట్ లేక రేస్లో వెనకబడ్ద గోపీచంద్కు 'పక్కా కమర్షియల్' పక్కాగా కమర్షియల్ హిట్ దక్కుతుందని చెప్పుకుంటున్నారు.