‘టైగర్ నాగేశ్వరరావు’: హీరోయిన్‌గా స్టార్ హీరోయిన్ చెల్లెలు

ABN , First Publish Date - 2022-04-01T01:27:52+05:30 IST

మాస్ మహారాజా రవితేజ మొదటి పాన్ ఇండియా చిత్రం ‘టైగర్ నాగేశ్వరరావు’. టైటిల్‌తోనే ఆసక్తిని క్రియేట్ చేసిన ఈ చిత్రం నుండి ఒక్కొక్కటిగా అప్‌డేట్ బయటికి వస్తున్నాయి. ఇటీవల బాలీవుడ్‌లో విడుదలై.. విమర్శకుల ప్రశంసలు పొందిన మరియు కమర్షియల్ బ్లాక్‌ బస్టర్ చిత్రంగా

‘టైగర్ నాగేశ్వరరావు’: హీరోయిన్‌గా స్టార్ హీరోయిన్ చెల్లెలు

మాస్ మహారాజా రవితేజ మొదటి పాన్ ఇండియా చిత్రం ‘టైగర్ నాగేశ్వరరావు’. టైటిల్‌తోనే ఆసక్తిని క్రియేట్ చేసిన ఈ చిత్రం నుండి ఒక్కొక్కటిగా అప్‌డేట్ బయటికి వస్తున్నాయి. ఇటీవల బాలీవుడ్‌లో విడుదలై.. విమర్శకుల ప్రశంసలు పొందిన మరియు కమర్షియల్ బ్లాక్‌ బస్టర్ చిత్రంగా దూసుకుపోతున్న ‘ది కశ్మీర్ ఫైల్స్‌’ చిత్రాన్ని రూపొందించిన అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్‌కు చెందిన అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్న చిత్ర‌మిది. రవితేజ కెరీర్‌‌లోనే అత్యధిక బడ్జెట్‌‌తో భారీ స్థాయిలో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని తేజ్ నారాయణ్ అగర్వాల్ సమర్పిస్తున్నారు. తాజాగా ఈ సినిమాలో రవితేజ సరసన నటించబోయే హీరోయిన్‌ని కూడా మేకర్స్ రివీల్ చేశారు.


ఈ క్రేజీ ప్రాజెక్ట్ కోసం బాలీవుడ్ నటి నుపూర్ సనన్‌ను ఎంపిక‌చేశారు. నుపూర్ సనన్ ఎవరో కాదు.. మహేష్ బాబు ‘1 నేనొక్కడినే’ చిత్రంలో హీరోయిన్‌గా నటించిన కృతి సనన్ చెల్లెలు. సోదరి కృతి సనన్‌నే ఓ రోల్ మోడ‌ల్‌గా ఎంచుకున్న నుపూర్.. చిత్ర‌రంగంలోకి ప్ర‌వేశించ‌డానికి ముందు అనేక అడ్డంకులు ఎదుర్కొంది. బాలీవుడ్‌లో హీరోయిన్‌గా ప్రయత్నాలు చేస్తున్న నుపూర్ సనన్.. ఇప్పుడు తెలుగులో ‘టైగర్ నాగేశ్వరరావు’తో అరంగేట్రం చేస్తోంది. గతంలో ఆమె అక్షయ్ కుమార్‌‌తో కలిసి ఓ మ్యూజిక్ వీడియోలో కూడా నటించింది. కాగా, హైదరాబాద్, మాదాపూర్‌లోని నోవాటెల్‌(హెచ్‌ఐసిసి)లో టైగర్ నాగేశ్వరరావు చిత్రాన్ని ఉగాది రోజున (ఏప్రిల్ 2వ తేదీ) ప్రారంభించనున్నారు. అదే రోజు సినిమా ప్రీ లుక్‌ని కూడా విడుదల చేయనున్నారు.



Updated Date - 2022-04-01T01:27:52+05:30 IST