ఎన్టీఆర్‌, పృథ్వీరాజ్ క‌పూర్‌ సినిమా ఆగిపోవ‌డానికి కార‌ణం...!

ABN , First Publish Date - 2021-05-19T21:09:51+05:30 IST

స్వ‌ర్గీయ ఎన్టీఆర్‌, బాలీవుడ్ అగ్ర క‌థానాయ‌కుడు పృథ్వీరాజ్ క‌పూర్ క‌లిసి ఓ సినిమాలో న‌టించాల్సింది. అయితే ఆ సినిమా ఆగిపోయింది. క‌థ న‌చ్చి పారితోష‌కం తీసుకోకుండా సినిమా చేస్తాన‌ని..

ఎన్టీఆర్‌, పృథ్వీరాజ్ క‌పూర్‌ సినిమా ఆగిపోవ‌డానికి కార‌ణం...!

స్వ‌ర్గీయ ఎన్టీఆర్‌, బాలీవుడ్ అగ్ర క‌థానాయ‌కుడు పృథ్వీరాజ్ క‌పూర్ క‌లిసి ఓ సినిమాలో న‌టించాల్సింది. అయితే ఆ సినిమా ఆగిపోయింది. క‌థ న‌చ్చి పారితోష‌కం తీసుకోకుండా సినిమా చేస్తాన‌ని పృథ్వీరాజ్ క‌పూర్ వంటి న‌టుడు ఆసక్తి చూపిన ఆ సినిమా ఆగిపోవ‌డానికి గ‌ల కార‌ణాలేంట‌నే విష‌యంలోకి వెళితే.. ఎన్టీఆర్‌, కాంతారావు, మ‌రో ముగ్గురు హీరోల‌తో ప్ర‌ముఖ నిర్మాత యు.విశ్వేశ్వ‌ర‌రావు కంచు కాగ‌డా అనే సినిమా చేయ‌డానికి రెడీ అయ్యారు. ఇందులో హీరోల తండ్రి పాత్ర కోసం ఓ ప్ర‌ముఖ న‌టుడిని సంప్ర‌దించ‌గా పారితోషకం విష‌యంలో ఒప్పందం కుద‌ర‌లేదు.


ఆ స‌మ‌యంలో విశ్వేశ్వ‌ర‌రావుకు, ఆ పాత్ర‌ను బాలీవుడ్‌లో స్టార్ న‌టుడైన పృథ్వీరాజ్ క‌పూర్‌తో చేయిస్తే బావుంటుంద‌ని ఆలోచించి, ముంబై వెళ్లి ఆయ‌న్ని క‌లిశార‌ట‌. క‌థ న‌చ్చిన పృథ్వీరాజ్ క‌పూర్ ఎలాంటి రెమ్యున‌రేష‌న్ లేకుండా న‌టిస్తాన‌ని, తెలుగులో డైలాగ్స్ కూడా చెబుతాన‌ని కూడా అన్నార‌ట‌. విశ్వేశ్వ‌రరావు ద్వారా విష‌యం తెలుసుకున్న ఎన్టీఆర్ సంతోష‌ప‌డ్డారు. మొద‌టి షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ పూర్త‌య్యింది. రెండో షెడ్యూల్ ప్రారంభం కావ‌డానికి స‌న్నాహాలు చేసుకుంటున్న త‌రుణంలో,  సినిమాలో హీరోయిన్‌గా న‌టిస్తోన్న జ‌మున గ‌ర్భ‌వ‌తి కావ‌డం, ఆమె ప్ర‌స‌వించే స‌మ‌యానికి పృథ్వీరాజ్ క‌పూర్ మ‌ర‌ణించ‌డంతో ప్రాజెక్ట్ ఆగిపోయింది.

Updated Date - 2021-05-19T21:09:51+05:30 IST